ఖానాపూర్ టౌన్, మే 1 : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో పీఏసీఎస్లో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎంతగానో కృషిచేస్తున్నారని అన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అదనపు కలెక్టర్ రాంబాబుతో కలిసి పరిశీలించారు. రైతులు అధైర్య పడవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
వేసవి క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్, అదనపు కలెక్టర్ రాంబాబు ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగంతో పాటు క్రీడలకు పెద్దపీట వేస్తున్నదన్నారు. క్రీడా శిబిరంలో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప సత్యనారాయణ రెడ్డి, జడ్పీటీసీ ఆకుల వెంకాగౌడ్, తహసీల్దార్ రాజమోహన్, మున్సిపల్ కమిషనర్ రత్నాకర్రావు, క్యాంప్ ఇన్చార్జి పీడీ క్రాంతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, పెటా సంఘం అధ్యక్షుడు రమేశ్, పీడీ రవీందర్గౌడ్, పీఈటీలు ఇమ్రాన్, రామకృష్ణ, సుమలత, నాయకులు అబ్దుల్ ఖలీల్, రాము నాయక్, గొర్రె గంగాధర్, రాజగంగన్న, కావలి సంతోష్, పుప్పాల స్వప్నాగజేందర్, తూం చరణ్, రామిడి మహేశ్ పాల్గొన్నారు.
పెంబి, మందపల్లిలో..
పెంబి, మే 1: పెంబి, మందపల్లిలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మండలంలోని 12 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీధర్, ఎంపీవో చిక్యాల రత్నాకర్ రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సల్లా నరేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ బైరెడ్డి గంగారెడ్డి, సర్పంచ్ సుధాకర్, ఎస్ఐ రజినీకాంత్ పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం
దస్తురాబాద్,మే1 : మండలంలోని చెన్నూర్,రేవోజిపేట, మున్యాలలో పీఏసీఏస్ ఆధ్వర్యంలో, గొడిసెర్యాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ప్రారంభించారు. అనంతరంలో మున్యాల,గొడిసెర్యాల గ్రామాల్లో పలువురిని పరామర్శించారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి, ఎంపీడీవో విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ సింగరి కిషన్, జడ్పీటీసీ శారదాశ్రీనివాస్, పీఏసీఏస్ చైర్మన్ రామడుగు శైలజారమేశ్ రావు, సర్పంచ్లు దుర్గం శంకర్, దీటి సుజాత సత్తన్న, బాదం నిరోషా, ఉప సర్పంచ్లు మాణిక్యరావు, కొమురెల్లి, ఆర్ఐ గంగన్న, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ రాజు, పీఏసీఏస్ డైరెక్టర్ సత్తన్న, సీఈవో రాజేందర్, సీసీ కృష్ణవేణి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్, నాయకులు రాజలింగం, శంకర్, విలాస్, పోశం, రాజ్కుమార్, గోపి, దుర్గయ్య, శంకర్, పీఏసీఏస్, ఐకేపీ, రెవెన్యూ సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ..
కడెం, ఏప్రిల్ 1: మండలంలోని చిన్నబెల్లాల్ శ్రీ వేంకటేశ్వస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెవెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు గోళ్ల వేణు, మండల ఉపాధ్యక్షుడు కన్నె శ్రీనివాస్, నాయకులు ఇందూర్ నేత, సురేందర్, ముక్కెర శ్రీనివాస్, గంగన్న, పంచతి సత్తన్న, చెన్ను మల్లేశ్, ఉన్నారు.