భైంసాటౌన్, మే 2 : అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. మండలంలోని మాటేగాంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుల శ్రేయస్సును ఆలోచించే ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. మండలంలోని మహాగాంలో ఏర్పాటు చేసిన బుద్ధ విగ్రహావిష్కరణకు రావాలని భీంయూత్ సభ్యులు కోరారు. ఈ నెల 5న విగ్రహావిష్కరణ ఉంటుందని తెలిపారు. అనంతరం ఏఎంసీ చైర్మన్ రాజేశ్ బాబు, వైస్ చైర్మన్ జేకే పటేల్, డైరెక్టర్లను ఎమ్మెల్యే సన్మానించారు. అనంతరం వారు ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, వైస్ ఎంపీపీ గంగాధర్, లింగా సర్పంచ్ దుప్పె గణేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ చాకేటి లస్మన్న, వైస్ చైర్మన్ సాయినాథ్, బీఆర్ఎస్ నాయకులు వెంకట్ రెడ్డి, భూమేశ్, మధుకర్ రెడ్డి, సోలంకి భీంరావు, ముత్యం రెడ్డి, రాంకుమార్, రౌతు రెడ్డి ఉన్నారు.
మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభం
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి అన్నారు. కుభీర్ మార్కెట్ కమిటీ ఆవరణలో మార్క్ఫెడ్ సహకారంతో స్థానిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్తో కలిసి ప్రారంభించారు. మక్కలు పండించిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, దళారులు తక్కువ ధరకు కొంటున్నారని మంత్రి అల్లోల సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసు కెళ్లినట్లు తెలిపారు. వెంటనే మక్కల కొనుగోళ్లను చేపట్టాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ మంత్రికి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు.
సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం
మండలంలోని ఆయా గ్రామాల నుంచి వచ్చిన రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యే విఠల్రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. హనుమాన్దీక్షా స్వాములు, రైతులు, నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులతో వేర్వేరుగా పాలాభిషేకాలు చేశారు.
రైతులకు సన్మానం
మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకు వచ్చిన పలువురు రైతులను ఎమ్మెల్యే సత్కరిం చారు. కుభీర్కు చెందిన పెంటాజీ అనే రైతు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో సహ కార సంఘం చైర్మన్, మార్క్ఫెడ్ డైరెక్టర్ రేకుల గంగాచరణ్, సర్పంచ్ మీరా విజయ్ కుమార్, ఉప సర్పంచ్ ఇక్రమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎన్నీల అనిల్, జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, వైస్ ఎంపీపీ మొహియొద్దీన్, ఎంపీటీసీలు బంక పోసానిబాయి, పంతుల హన్మాండ్లు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మెంచు రమేశ్, ఏఎంసీ మాజీ చైర్మన్ కందూరి సంతోష్, మాజీ డీసీఎంఎస్ డైరెక్టర్ దొంతుల రాములు, సీఈవో ఎగ్గం క్రాంతికుమార్, మార్కెట్ కమిటీ సెక్రటరీ మధుసూదన్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, రైతు సంఘం అధ్యక్షుడు పీరాజీ, రాజన్న డాక్టర్, పెంటాజీ, టౌన్ అధ్యక్షుడు బొప్ప నాగలింగం, గోనె కల్యాణ్, సూది రాజన్న, రఫీక్, దత్తుసింగ్, దిగంబర్ పటేల్, మాజీ సర్పంచ్ బాబు, డాక్టర్ పోశెట్టి, సాహెబ్రావు, పార్డి(కే), జాంగాం సర్పంచ్లు ఆకుల గంగాధర్, ముజాహిద్ఖాన్, రైతులు పాల్గొన్నారు.