నార్నూర్ : మనిషి భవిష్యత్తును మార్చే శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంటుందని నార్నూర్ సర్పంచ్ బానోత్ కావేరి ( Sarpach Kaveri ) అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలికల పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు సర్పంచ్ ను శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి ఉన్నత చదువులు చదివి తాను రాజకీయంలోకి అడుగుపెట్టానన్నారు.
ప్రజా సేవకు ప్రజలు సర్పంచ్ గా గెలిపించారని తెలిపారు. విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణతో లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని, ఆ దిశగా కష్టపడి ఉన్నత స్థాయిని చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాలలోని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జాదవ్ విఠల్, వార్డెన్ వనిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.