దండేపల్లి, జనవరి 14 : మండలంలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం గోదా రంగనాయక స్వామి కల్యాణం వైష్ణవ సంప్రదాయం ప్రకారం వైభవంగా నిర్వహించారు. యేటా ధనుర్మాసంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా ఈ వేడుక నిర్వహించ గా, భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు రఘుస్వామి, సంపత్ స్వామి, వేదపారాయణదారు నారాయణశర్మ, అర్చకులు పాల్గొన్నారు.