నిర్మల్ అర్బన్, జూన్ 23 : పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో శుక్రవారం ఒలింపిక్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ రాంబాబు, డీఎస్పీ జీవన్ రెడ్డి ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ఈ రన్ ప్రధాన రహదారుల గుండా సాగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ నడకను అలవాటు చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా ఒలింపిక్ బాధ్యుడు శ్రీధర్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశ్వర్ రావు, హాకీ అసోసియేషన్ అధ్యక్షుడు పాకాల రాంచందర్, పేట అధ్యక్షుడు భూక్యా రమేశ్, కార్యదర్శి భోజన్న, సెక్రటరీ రమణారావు, శ్యాముల్, అన్నపూర్ణ, భూమన్న, రామారావు, జమున, సంగీత, వెన్నెల, అంబాజీ, శ్రీనివాస్, దేవేందర్, సుందల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.