ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఒలింపిక్ డే రన్
ఆదిలాబాద్ రూరల్: క్రీడాకారులను ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శినీ స్టేడియంలో ఒలింపిక్ డే రన్ను ఆయన జ్యోతి వెలిగించి ర్యాలీ ప్రారంభించారు. జిల్లాలో ఎలాంటి క్రీడలు జరిగినా తామెప్పుడూ అండగా ఉంటామన్నారు.
జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, హ్యాండ్బాల్ సంఘం కార్యదర్శి చరణ్ పాల్గొన్నారు.