ఆదిలాబాద్ : కష్టపడి పండిచిన పంటను విక్రయించడానికి జొన్న రైతులు ఆదిలాబాద్ జిల్లాలో పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగు రోజుల తర్వాత గురువారం జొన్నల సేకరణను ప్రారంభించిన అధికారులు పంట కొనుగోలులో తీవ్ర జాప్యం చేస్తున్నారు. దీంతో భారీగా పంటను తీసుకొచ్చిన రైతులు మండుటెండలో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి కురిసిన వర్షానికి పంటను కాపాడుకోవడానికి రైతులు ప్లాస్టిక్ కవర్లను కొనుగోలు చేసి కప్పి
ఉంచారు. జొన్నలు కొనుగోళ్లలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా తామ నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.