జన్నారం, జనవరి 7 : కల్తీ పెట్రోల్ విక్రయించిన ఓ బంక్ను అధికారులు సీజ్ చేశారు. శనివారం మండల కేంద్రంలోని ఓ బంక్లో పలువురు తమ వాహనాల్లో పెట్రోల్ పోయించుకున్నారు. కొద్దిసేపటికే అవి నడువకుండా ఆగిపోయాయి.
దీంతో అనుమానం వచ్చి వాహనాల్లో పోయించుకున్న పెట్రోల్ను తీసి చూశారు. కల్తీ జరిగినట్లు గుర్తించారు. బంక్ యజమానిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న ఆర్ఐ గంగారాజు అక్కడికి చేరుకొని పంచనామా చేసి బంక్ను సీజ్ చేశారు.