Free Current | కాంగ్రెసోళ్లు కర్షకులపై కుట్రలు చేస్తూనే ఉన్నరు. మరో పిడుగు వేయడానికి మన ముందుకొస్తున్నరు. రైతన్నలపై ఆర్థిక భారం మోపడానికి రెడీ అవుతున్నరు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డేమో వ్యవసాయానికి మూడు గంటల కరెంటే సాలంటడు. మరో కాంగ్రెస్ నాయకుడేమో బాయిలకాడ 3, 5 హెచ్పీకి బదులు 10 హెచ్పీ మోటర్లు పెట్టుకోవాలని అంటున్నడు. హస్తం పార్టీలో ఎవరికీ తోచిన విధంగా వారు మాట్లాడుతున్నరు. అసలు వీరిలో ఎవరైనా ఎవుసం చేసినోడు ఉంటే అవగాహన ఉండేది. అందరూ అవగాహన రాహిత్యంతో ఇష్టం వచ్చినట్లు మైకుల ముందు మొత్తుకుంటున్నరు.
అని రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. టెన్ హెచ్పీ మోటర్లు పెడితే రెండు పంటలకు వచ్చే నీరు ఒక్క పంటకే సరిపోతుందని, రెండో పంటకు నీరెక్కడి నుంచి తెస్తారని ప్రశ్నిస్తున్నరు. భూగర్భ జలాలు ఎండిపోతే తాగు, సాగు నీరుకు కష్టమవుతోందని మండిపడుతున్నరు. ఇగ, కాంగ్రెస్ పాలనొస్తే మళ్లీ బొంబాయి, సూరత్, గల్ఫ్ బాట పట్టాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నరు. 10 హెచ్పీ మోటర్లు వద్దే వద్దు.. తెలంగాణ సర్కారు ఇస్తున్న 24 గంటల కరెంటే ముద్దని తెగేసి చెప్తున్నరు. రైతులతోపాటు మోటర్ మెకానిక్లు, విద్యుత్ అధికారులు, భూగర్భ జలాల నిపుణులు 10 హెచ్పీ మోటర్లను వ్యతిరేకిస్తున్నరు.
– మంచిర్యాల, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రైతులు 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్ల సాయంతో పంటలకు నీరందిస్తరు. త్రీఫేజ్ కరెంటు సరఫరాకు అధికారులు 25 కేవీ, 63 కేవీ, 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. 63 కేవీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా 5 హెచ్పీ మోటర్లను ఏకకాలంలో నడిపి పంటలకు నీరందించవచ్చు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ ద్వారా పన్నెండు 5 హెచ్పీ మోటర్లు నడిపించే అవకాశం ఉంది. ఇంతకు మించి ఎక్కువ మోటర్లు పెడితే ట్రాన్స్ఫార్మర్పై ఓవర్లోడ్ పడి కాలిపోతాయి. రైతులు 5 హెచ్పీ ద్వారా వంద పైపులు వేసి పదెకరాలకు నీరు ఎంతసేపైనా అందించవచ్చు. 5 హెచ్పీ మోటర్లు మాత్రమే సరిపోతాయి. 10 హెచ్పీ మోటర్ల వినియోగం సాధ్యం కాదు. వీటిని రైతులు ఎక్కడా వినియోగించడం లేదు. 100 కేవీ ట్రాన్స్ఫార్మర్ మీద కేవలం నాలుగు మోటర్లు మాత్రమే నడుస్తాయి. విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. బావులు, బోర్లలో నీరు ఇంకిపోతోంది. 10 హెచ్పీ మోటర్ల వినియోగం ఆచరణలో సాధ్యం కాదు.
– రామయ్య, మోటర్ మెకానిక్, ఆదిలాబాద్
కాంగ్రెస్.. వ్యవసాయానికి మూడు గంటలే కరెంటి స్తామంటోంది. ఆ విద్యుత్కు 10 హెచ్పీ మోటరు వాడాలని చెబుతోంది. ఈ మోటరు కొనాలంటే ప్రతి రైతు రూ.50 వేలు వెచ్చించాలి. దీనికి అధిక కరెంటు అవసరం. లోడ్ అధికమై పంపిణీకి ఇబ్బంది అవుతది. ఫలితంగా పంటలు ఎండిపోతయి. క్రమంగా భూముల ధరలు తగ్గుతయి. లక్షలు పలికే భూములను అడ్డికి పావుసేరు అమ్ముకోవాల్సి వస్తోంది. అనంతరం రైతులు కూలీలుగా మారుతరు.
మంచిర్యాల, నవంబర్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రైతుబం ధుతో సాగుకు పెట్టుబడి సాయం, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, కావల్సినన్ని నీళ్లతో తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నరు. ఎద్దు, ఎవుసం ఎరుకలేని కాంగ్రెసోళ్లు మాత్రం తెలంగాణ రైతులను ఆగం చేసేందుకు కుట్రలు చేస్తున్నరు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలంటరు. దాని మీద అన్నదాతలు అగ్గి మీద గుగ్గిలమైతే 10 హెచ్పీ మోటర్ పెట్టుకుంటే మూడు గంటల్లో తడిసిపోతదని చెప్తరు. అది కూడా రైతులకు నచ్చుతలేదని తెలిసి తె లంగాణ సర్కారు ఇప్పుడిస్తున్నట్లే 24 గంటల కరెంట్ ఇస్తమని బుకాయిస్తురు. పూటకో మాట మాట్లాడుతూ అయోమయానికి గురి చేస్తరని కాంగ్రెస్పై రైతులు మండిపడుతున్నరు.
కాంగ్రెస్ హయాంలో ఏ అర్ధ రాత్రో.. అప రాత్రో.. దొంగోనోలే వచ్చే కరెంట్ కోసం పొలాల దగ్గర పడిగాపులు కాసినమని, కరెంట్ వచ్చే టైమ్ తెల్వక అర్ధరాత్రి మోటర్లు పెట్టేందుకు పోతే, కాళ్లకు కరెంట్ తీగలు తగిలి, పాములు, తేల్లు కుట్టి పాణాలు పోయేవని.. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే అదే మూడు గంటల కరెంట్ కోసం మళ్ల సచ్చిపోవాలా.. అని ప్రశ్నిస్తున్నరు. టెన్ హెచ్పీ మోటర్ పెట్టుకోవాలంటే ఇప్పటికిప్పుడు రూ.లక్ష కావాలని ఆ డబ్బులకు ఎక్కడికి పోవాలే అని నిలదీస్తున్నరు. పది హెచ్పీ మో టర్ పెడితే ఇప్పుడు రెండు పంటలకు వస్తున్న నీళ్లు ఒక్క పంటకు కూ డా సరిపోవని పేర్కొంటున్నరు. ఉన్న నీళ్లను ఆ మోటర్ రెండు రోజు ల్లో తోడేస్తే ఏడాదంతా ఎట్లా ఎల్లదీసేదని తలలు పట్టుకుంటున్నరు.
నోటికి వచ్చినట్లు మాట్లాడి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ఆడుకుంటుందని మండిపడుతున్నరు. ఏదో ఒకటి మాట్లాడి మూడు గంటలని, 10 హెచ్పీ మోటర్లు అని.. చివరకు 24 గంటలంటున్న కాంగ్రెసోళ్లు రేపు దారితప్పి అధికారంలోకి వస్తే రైతుల బతుకులు అంధకారంలోకి పోతాయేమోనని భయపడిపోతున్నరు. 10 హెచ్పీ మోటర్లు వద్దే వద్దు.. తెలంగాణ సర్కారు ఇస్తున్న 24 గంటల కరెంటే చాలని తెగేసి చెప్తున్నరు. రైతులతోపాటు మోటర్ మెకానిక్లు, విద్యుత్ అధికారులు, భూగర్భ జలాల నిపుణులు 10 హెచ్పీ మోటర్లను వ్యతిరేకిస్తున్నారు.
సమైక్య పాలనలో 50 ఏండ్లు కాంగ్రెస్, టీడీపీ పాలించినయ్. ఏ నాడు కూడా రైతుల కోసం ఆలోచన చేయలే. ఎవుసం అంటేనే నరకం అనే దుస్థితికి తీసుకొచ్చినయ్. కరెంట్ ఇయ్యకుండా రైతులను అరిగోస పెట్టినయ్. కరెంట్ ఎప్పుడు వస్తదో తెలియక పొలాల్లో మంచెలు వేసుకొని, గడ్డివాముల దగ్గర కూసొని రైతులు పడిగాపులు కాసేటోళ్లు. రోజుల తరబడి కరెంట్ రాక విద్యుత్ సబ్స్టేషన్లు, విద్యుత్ కార్యాలయాలను ముట్టడించేటోళ్లు. గ్రామాలు, పట్టణాల్లో కరెంట్ ఉండేది కాదు. ఊళ్లలో సాయంత్రం 6 గంటలకు వచ్చే కరెంట్ తెల్లారే సరికి ఉండకపోయేది. ఉదయం పూట పంకలు తిరిగేటివికాదు. పరిశ్రమలల్లోనైతే పీక్ అవర్లో విద్యుత్ వాడకుండా అడ్డుకునేటోళ్లు. పొద్దంతా కరెంట్ లేక షాపులు, వాణిజ్య సముదాయాల్లో జనరేటర్లు పెట్టుకునేటోళ్లు. ఇప్పుడు మాయమాటలు నమ్మితే ఆ రోజులు మళ్ల వొస్తయా అనే సందేహం ప్రజల్లోనూ మొదలైంది. ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే చర్చ నడుస్తున్నది.
తెలంగాణ స్వరాష్ట్రంలో పదేళ్ల పాలనలో కరెంట్ షాక్ కొట్టి రైతులు చనిపోయిన దాఖలాలు, కరెంట్ కోసం పొలాల కాడ పడిగాపులు కాయాల్సిన అక్కర లేకుండా పోయింది. రైతుకు ఎప్పుడు కుదిరితే అప్పుడే మోటర్ వేసుకుంటే పొలాలకు నీళ్లు పారుతున్నయ్. గింత మంచి విద్యుత్ సరఫరాను ఆపేసి, మూడు గంటలు కరెంట్ ఇస్తే సరిపోతదని కాంగ్రెస్ లీడర్ రాహుల్గాంధీ, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి మాట్లాడటంపై రైతులు మండిపడుతున్నారు. ఉచిత విద్యుత్ ఇచ్చిన కేసీఆర్ రానున్న రోజుల్లో దాన్ని కొనసాగిస్తారనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1,43,217 ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల ద్వారా లక్షలాది మంది రైతుల పొలాలకు నీళ్లు పారుతున్నయ్. ఆసిఫాబాద్ జిల్లాలో 6,800, మంచిర్యాల జిల్లాలో 45,793, నిర్మల్లో 72,000, ఆదిలాబాద్లో 18,624 వ్యవసాయ కనెక్షన్లకు కరెంట్ బిల్లులు కట్టే అవసరం లేకుండా, మోటార్లు కాలిపోయే దుస్థితి లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతున్నది.
కడెం, నవంబర్ 19: భూస్వాములు తప్ప రైతులెవ్వ రూ 10 హెచ్పీ మోటర్లు వాడరు. ఐదు నుంచి పదె కరాల వరకు రైతులు కూడా 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లు వాడుతం. సామాన్య రైతులు 10 హెచ్పీ మోటర్లు ఎందుకు వాడుతరు. వ్యవసాయ బావుల కు 10 హెచ్పీ మోటర్లు ఏ రైతు కూడా ఉపయోగించ రు. ఈ 10 హెచ్పీ పవర్కు వేసిన పంటలు కొట్టుకు పోయే ప్రమాదం కూడా ఉంటది. బావిలో నీరు త్వరగా ఖాళీ అయిపోయి, మోటర్ మీద భారం పడుతది. కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్రెడ్డికి వ్యవసాయం మీద కనీసం అవగాహన ఉన్నా చిన్న, సన్నకారు రైతులు 10 హెచ్పీ మోటర్లు వాడరు అనే విషయాన్ని గుర్తించాలె. రేవంత్ రెడ్డి అలాంటి పనికి మాలిన మాటలు మా ట్లాడడం సరికాదు.
నాకు ఎకరం పొలం ఉంది. నా పొలానికి రెండు, మూడు రోజు లకోసారి నీరు పారిస్తా. నేను వ్యవసాయంతో పాటు, హమాలీగా పని చేస్తా. నాకు వీలున్న సమయంలో నేను పొలానికెళ్లి నీరు పెడతా. 3 హెచ్పీ మోటర్ ఉంది. దీంతో పంటకు సరిపడా నీరందుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ రైతులకు ఉచితంగా ఇస్తుంటే కాంగ్రెసోల్లు ఓట్ల కోసం ఇలా రైతులతో రాజకీయాలు చేస్తున్నరు. వ్యవసాయం మీద అవగాహన లేని కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల పని, వారి అవసరాలు ఎలా తెలుస్తయ్. అందుకే 24 గంటల నిరంతరం విద్యుత్ను సరఫరా చేసే కేసీఆర్ ప్రభుత్వానికే రైతులమంతా అండగా ఉంటాం.
-బైరి అంజన్న, రైతు, కన్నాపూర్, కడెం
కాంగ్రెస్ నాయకులు ఎన్నికల్లో లబ్ధి పొందడానికే రైతులను మభ్యపెడుతున్నరు. వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకున్నదే లేదు. ఓటుబ్యాంకుగా వాడుకున్నారే తప్పా వ్యవసాయ రంగం బాగుపడడానికి ఏ ఒక్క పథకం అమలు చే యలె. విత్తనాలు, ఎరువులు మొదలుకొని పంటలు అమ్మడానికి కూడా రైతులు అరిగోస పడ్డరు. సమస్యలు పరిష్కారించాలని కోరినా నాడు లీడర్లు పట్టించుకన్నదే లేదు. పదేళ్లుగా రై తుల మేలు కోరే ప్రభుత్వం ఉన్నది. సీఎం కేసీఆర్ కారణంగా రైతులు సంతోషంగా బతుకుతున్నరు. ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల కరెంటుతో 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్ల కింద పంటలకు నీరందించుకుంటూ రైతులు రెండు పంటలు సాగు చేస్తున్న రు. కాంగ్రెస్ నాయకులు, రైతులకు 24 గంటల కరెంటు వద్దు మూడు గంటలు చాలు అంటున్నరు. 10 హెచ్పీ మోటర్లు వాడి పంటలకు నీరు అందించాలంటున్నరు. 10 హెచ్ మోటార్ల వినియోగం సాధ్యం కాదు. టీపీసీసీ ఆధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎవుసం గురించి అసలు తెల్వదనుకుంటున్న.
-ఏనుగు అశోక్రెడ్డి, రైతు, కరంజి, భీంపూర్ మండలం
లక్షెట్టిపేట, నవంబర్ 19: రేవంత్రెడ్డికి వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లే నట్లనిపిస్తున్నది. ఏవో నోటికొచ్చినట్లు ఉత్తి మాటలు చెప్పిండు. కాంగ్రెస్, టీడీపీ ప్ర భుత్వాల పాలనలో రైతులు కేవలం 5 హెచ్పీ మోటర్లు.. అంతకంటే తక్కువ మో తాదు మోటర్లు పెట్టి వ్యవసాయం చేసేటోళ్లు. అలాంటి చిన్న మోటర్లకే బావుల్లో నీరు ఉండక మోటర్లు మొత్తం కాలిపోయేవి. పైగా అప్పుడు నాణ్యమైన కరెంటు ఉండేది కాదు. ఎప్పుడు కరంటు వచ్చేదో.. ఎప్పుడు పోయేదో ఎవ్వరికీ తెలిసేది కాదు. కరెంటు రాగానే రైతులు మొత్తం ఒకే సారి మోటర్లు వేయడం వల్ల ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయేవి. వాటిని రైతులే తీసుకుని పోయి రోజుల తరబడి కాపుకాస్తూ మరమ్మతులు చేయించుకునే పరిస్థితి ఉండేది. రైతులు రోజుల తరబడి దుకాండ్ల చుట్టూ తిరిగి తిప్పల పడేటోళ్లు.
మాక్కూడా మరమ్మతులు చేసేందుకు టైముండేది కాదు. రైతులను గోస పెట్టుకునేటోళ్లం. ఇప్పుడు రేవంత్రెడ్డి చెప్పినట్లు 10 హెచ్పీ మోటర్లు పెడితే కనీసం గంట కూడా నడువయ్. ఎంతపెద్ద బావి అయినా సరే గంట లోపే మొత్తం బావిలో ఉన్న నీళ్లన్నీ ఎత్తి పోస్తయి. అట్లనే ఔట్ఫ్లో పైప్ కనీసం మూడు నుంచి ఐదు ఇంచుల పైనే ఉండాలి. బావుల్లో పదికి పైన ఊటలు ఉన్నా.. కూడా అంత ప్రెషర్ ఉండదు. 10 మంది రైతులు ఓకేసారి మోటర్లు ఆన్ చేస్తే ఏ ట్రాన్స్ఫార్మర్ కూడా ఆగదు. నాకున్న 30 ఏండ్ల అనుభవంతో చెబుతున్న. ఐదు గంటల కరెంటు చాలు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు.. అది అంతా అబద్ధం. 50 మంది రైతులు ఒక్కసారి మోటర్ ఆన్ చేస్తే సబ్ స్టేషన్ మొత్తం కుప్పకూలి పోవడం ఖాయం. అదే 24 గంటల కరెంటు ఉంటే రైతులు అంతా ఒకేసారి మోటర్ వేయరు. నిత్యం కరంటు ఉంటది అని ఎవరి ఇష్టం వచ్చిన సమయంలో వాళ్లు నీళ్లు పెట్టుకుంటరు. కాంగ్రెసోళ్లు చేప్పేవన్నీ అబద్ధాలే.. – ద్యావ సత్యనారాయణ రెడ్డి, మోటర్ వైడర్, లక్షెట్టిపేట
బెల్లంపల్లి, నవంబర్ 19 : 10 హెచ్పీ మోటార్ వేసుకుంటే దానికి తట్టుకోలేక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే రేవంత్రెడ్డి కొనిస్తాడా… బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇస్తున్న 24 గంటల కరెంట్తో వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నాం. గీ ఎన్నికల కోసం 10 హెచ్పీ మోటార్లు, మూడు గంటల కరెంట్ అని రైతులకు వ్యతిరేకంగా పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ కింద నాలుగు నుంచి ఐదు మోటర్లతో వ్యవసాయం చేసుకుంటున్నాం.
గిప్పుడు కాంగ్రెసోళ్లు అన్నట్లు 10 హెచ్పీ మోటార్లు పెట్టుకుంటే ఇద్దరు రైతులు రెండు మోటార్లు పెట్టుకుంటేనే ఆ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది. మిగతా ముగ్గురి పొలాలకు నీళ్లు ఎట్లా.. ఎక్కువ లోడ్ పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే మళ్లీ మళ్లీ కొనుక్కోవాలా.. 10 హెచ్పీ మోటర్లు కొనాలంటే లక్షకు పైగానే ఖర్చు అవుతుంది. ఒక్కటేసారి ఈ మోటర్లతో నీటిని తోడితే ఒక్కసారిగా భూమిలోపల నీరు అయిపోతుంది. మళ్లీ ఊరడానికి చాలా సమయం పడుతుంది. అప్పటి వరకు పంటలు ఎండిపోయి నష్టపోవాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అసలు అవగాహన లేదు. ఎన్నికల్లో లబ్ధిపొందాలని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రైతులు ఎప్పటి నుంచో మూడు, లేదా ఐదు హెచ్పీ మోటర్లనే వాడుతున్నరు. ఇప్పుడు లేనిపోని మాటలు చెప్పి మోసం చేయాలని చూస్తున్నరు. రైతులెవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి రాబోయేది రైతు పక్షపాతి ప్రభుత్వమే
– టేకుమట్ల రాజేశ్, బూదఖుర్ధు
దిలావర్పూర్, నవంబర్ 19: రైతు బాగు పడడం కాంగ్రెస్ కు ఇష్టం ఉండదు. మూడు గంటల కరెంట్తో మా పొలా లు సాగు కావు. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు మూడు గంటల కరెంట్తో రైతులు బాగుపడ రు. ఇప్పుడున్న ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం తో 5 హెచ్పీ మోటర్లను వాడుతున్నం. కాంగ్రెస్ పార్టీ 3 గంట ల కరెంట్ ఇచ్చి 10 హెచ్ మోటర్లను పెట్టిస్తమని చెబుతున్నరు. రైతులందరం ఒకేసారి 10 హెచ్పీ మోటర్లను చాలు చేస్తే ట్రా న్స్ఫార్మర్ పేలిపోయి సమీపంలో ఉన్న సబ్స్టేషన్పై భారం పడి అందులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. రైతులతో పాటు మా ఇండ్లలో కూడా కరెంట్ కష్టాలు మొదలవుతాయి. మా రై తులకు సర్కారు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు 25 హెచ్పీలవి ఉంటా యి.
కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు 10 హెచ్పీ మోటర్లు మూడు చాలు చేస్తే, మూడు సెకన్లనే మోటర్తో పాటు ట్రాన్స్ఫార్మర్ పేలిపోతుంది. ఇగ మళ్లీ ఆగం మొదలైతది. గిప్పుడున్న సర్కా రు 24 గంటల కరంట్ ఇస్తున్నది. పంటలు మంచిగ పండు తన్నయ్. మేము ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వాటిని గుర్తుకు తెచ్చుకోవాలి. సచ్చినా కాంగ్రెస్ పార్టీ మాట నమ్మం. ఇగ మళ్లీ మా బతుకులు ఆగం చేస్తరు. 10 హెచ్పీ మోటర్లు పెడితే భూగ ర్భ జలాలు కిందికి పడి పోతయి. బోర్లో నీటి ఊటలు అందు బాటులో లేకుండా అవుతాయి. కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పదేండ్ల కాలంలో వీటన్నింటినీ మరిచిపోయి రైతులమంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నం.
-ఏలాల చిన్నారెడ్డి, రైతు గుండంపల్లి