నిర్మల్ : బాసర జ్ఞాన సరస్వతీ దేవి అమ్మవారి సన్నిధిలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ శ్రేణులు కేటీఆర్ పేరు మీద ప్రత్యేక కుంకుమార్చన, పూజలు నిర్వహించారు.
మంత్రి కేటీఆర్ నిండూ నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని పూజలు చేశారు. అనంతరం యాచకులకు, పేదలకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.