నిర్మల్, మే 27: నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామక ప్రక్రియను నిలిపి వేస్తునట్లు అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం క్యాంప్ ఆఫీస్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నిర్మల్ మున్సిపాలిటీలో పీహెచ్సీ వర్కర్ల నియామకాల్లో అవకతవకలు జరిగియంటూ గత కొన్ని రోజులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కలెక్టర్కు ఆదేశాలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. నివేదిక అందిన వెంటనే పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.