నిర్మల్ అర్బన్, జనవరి 7 : నిర్మల్ జిల్లాలోని సెయింట్ థామస్ పాఠశాలలో 9వ తేదీ నుంచి 11 వరకు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ను నిర్వహించేందుకు జిల్లా విద్యా శాఖ, రాష్ట్ర స్థాయి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను విజయవంతం చేసే అంశంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులతో సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్కు వచ్చే విద్యార్థులకు గైడ్ టీచర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భోజన, రవాణా, వసతి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. ఈ వేడుకలను విజయవంతం చేసేందుకు డీఈవో రవీందర్ రెడ్డి పలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో అంశంపై ఒక్కో కమిటీకి బాధ్యతలు అప్పగించారు. సమష్టిగా కలిసి వేడుకలను జయప్రదం చేసేందుకు కృషి చేస్తున్నారు.
అతిథులు వీరే..
సైన్స్ ఫెయిర్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అటవీ పర్యావరణ, దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకర ణ్ రెడ్డి వేడుకలను ప్రారంభించనున్నారు. వీరితో పాటు విద్యాఖాక కార్యదర్శి వాకాటి కరుణ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ దేవసేన, ఎస్సీఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యేలు విఠల్ రెడ్డి, రేఖా నాయక్, ఎమెల్సీ దండె విఠల్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు ఆర్జేడీ సత్యనారాయణ, ట్రిపుల్ ఐటీ వైస్ చాన్స్లర్ వెంకట రమణ, పలువురు అతిథులు హాజరుకానున్నారు.
796 ప్రదర్శనలు..
తెలంగాణలోని 33 జిల్లాల నుంచి ఇటీవల ఆయా జిల్లాల్లో నిర్వహించిన జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్లో ఉత్తమ ప్రతిభ చూపిన జూనియర్, సీనియర్ విభాగాల నుంచి ఎంపిక చేసిన ప్రదర్శ నలను రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించను న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల 796 ప్రదర్శనలు రానున్నాయి. వీరితో పాటు 796 మంది విద్యార్థులు 796 మంది గైడ్ టీచర్లు హాజరుకానున్నారు. అత్యుత్తమ ప్రదర్శనలను ఎంపిక చేయడానికి బాసర ట్రిపుల్ ఐటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లను న్యాయ నిర్ణేతలు రానున్నారు.