బోథ్, నవంబర్ 14 : మండల కేంద్రంలోని నాగభూషణం, వేదం, పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో బాలల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. పట్నాపూర్లోని దిశ మోడల్ స్కూల్లో సర్పంచ్ సుగుణ విద్యార్థులకు నోట్బుక్లు, పెన్నులు పంపిణీ చేశారు. సొనాల, కౌఠ (బీ), బోథ్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యాబోధన చేశారు. కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు లాలుసింగ్, కరస్పాండెంట్లు కిశోర్, సంతోష్, కార్యదర్శి మిథున్, తదితరులు పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 14: మండలంలోని తర్నం(కే) ప్రాథమికోన్నత పాఠశాలలో గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఎర్ర చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. అనంతరం చంద్రశేఖర్ రెడ్డిని పాఠశాల యాజమాన్య కమిటీ, ప్రధానోపాధ్యాయుడు రవికుమార్ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచ్ విశాల్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) మండల కన్వీనర్ అల్లూరి శివారెడ్డి, పాఠశాల ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ సుధాకర్, పంచాయతీ కార్యదర్శి జ్యోతి, ఏఈవో సంకీర్తన, ఉపాధ్యాయురాలు బబిత, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆదర్శ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవం
మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో స్వయం పాలన దినోత్సవాన్ని నిర్వహిచారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు, ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. వారిని ప్రిన్సిపాల్ ఉమేశ్రావు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు అభినందించారు.
మండల కేంద్రంలోని వివేకానంద విద్యా సంస్థలో విద్యార్థులచే న్యూట్రిషన్ ఫుడ్ మేళా నిర్వహించారు. మనదేశంలో అన్ని రాష్ర్టాల వంటకాలను ప్రదర్శించగా సీఐ నైలు, మండల విద్యాధికారి ఉదయ్రావ్, పాఠశాల చైర్మన్ నారాయణరెడ్డి పరిశీలించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు స్రవంతి, ప్రమోద్, గంగాధర్, నాగేందర్ పాల్గొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులు
నేటి బాలలే రేపటి పౌరులని సిరికొండ కాంప్లెక్స్ హెచ్ఎం రాధాకృష్ణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత ప్రాథమిక, ప్రైవేట్ పాఠశాలలతో పాటు రాయిగూడ, రిమ్మ ఆశ్రమ ఉన్నత బాలుర, సాత్మోరి పాఠశాలలో మాజీ ప్రధాని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కొన్ని పాఠశాలల్లో క్విజ్, నృత్య పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
మండలంలోని తేజాపూర్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల, నేరడిగొండ కేజీబీవీలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు. ప్రధానోఫాధ్యాయురాలు జయశ్రీ పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్గౌడ్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
మండలంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఐటీడీఏ పరిధిలోని గిరిజన ఆశ్రమ, ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దస్నాపూర్, కేస్లాగూడ(ఎం) జిల్లా పరిషత్ పాఠశాలతో పాటు ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులకు ఆటలపోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాథోడ్ జ్ఞానేశ్వర్, రాంకుమార్ పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు. విద్యార్థులు 120 రకాల ఆహార పదార్థాలను విద్యార్థులు తీసుకువచ్చారు. కార్యక్రమంలో శ్రీ చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్.శ్రీనివాస్గౌడ్, ప్రధానోపాధ్యాయులు అల్లూరు భూపతి రెడ్డి, స్కూల్ డీన్ ఈశ్వర్, ఇన్చార్జిలు పద్మ, జెస్సికా, వినోద్ రెడ్డి, దేవన్న, సంగీత, శ్రీవిద్య, శ్రీహరిబాబు, రేఖ అనసూయ, విలాస్ పాల్గొన్నారు.
విద్యపై దృష్టి సారించాలి
విద్యార్థులు సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ విద్యపై దృష్టి సారించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ చైతన్య పాఠశాలలో చిన్నారులతో ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గణేశ్ రెడ్డి, సాయిని రవి, ప్రిన్సిపాల్ ప్రభాకర్, సంతోష్, కృష్ణ పాల్గొన్నారు.
ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో..
జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డిపో మేనేజర్ కె.కల్పన పాఠశాలల విద్యార్థులకు స్వీట్లు పంచి పెట్టారు. కార్యక్రమంలో స్టేషన్ మేనేజర్ చందర్, శివదాస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ పాల్గొన్నారు.
మండల కేంద్రంతో పాటు డోప్టాల, సిర్సన్న గ్రామాల్లోని పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు ఆటాపాటలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇంద్రశేఖర్, వార్డు సభ్యులు ఆకాశ్ గుండావార్, దేవీదాస్, ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.