బోథ్, ఆగస్టు 19: టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని జడ్పీటీసీ సంధ్యారాణి అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని దవాఖానల్లో శుక్రవారం టీఆర్ఎస్ నాయకులతో కలిసి రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్యాదవ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, ఆత్మ చైర్మన్ ఎం సుభాష్, ఉపసర్పంచ్ పల్లవి, ఎంపీటీసీ రజియాబేగం, సూపరింటెండెంట్ రవీంద్రప్రసాద్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
సొనాల పీహెచ్సీలో …
సొనాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బోథ్ సీహెచ్సీలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రేడ్డు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బోథ్ రేంజ్ అధికారి గణేశ్, ఇచ్చోడ ఎఫ్ఆర్వో పాండురంగ్, ఎఫ్ఎస్వో ఆత్రం సుందర్, ఎఫ్బీవోలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఆగస్టు 19 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఇచ్చోడ డివిజనల్ అటవీ శాఖ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారి ఆకుదారి సాగర్, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
భీంపూర్, ఆగస్టు 19 : మండల కేంద్రంలోని పీహెచ్సీలో హెచ్ఈవో జ్ఞానేశ్వర్, వైద్య సిబ్బంది రోగులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది ప్రియాంక, అశోక్రెడ్డి, విష్ణుకుమార్, శివాజీ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, ఆగస్టు 19 : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తుల్జా పెట్రోల్ బంక్ యజమాని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి నిలోఫర్, పెట్రోల్ బంక్ మేనేజర్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
బేల, ఆగస్టు 19 : మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో నాయకులు, అధికారులు రోగులకు పండ్లు పంపిణీ చేశారు. బేలలో శనివారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల మహిళలు, యువతులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ ఇంద్రశేఖర్, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవార్, తహసీల్దార్ బడాల రాంరెడ్డి, ఎస్ఐ కృష్ణకుమార్, ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, ఐకేపీ సీసీ శరత్ రెడ్డి, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు జక్కుల మధుకర్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
రిమ్స్లో..
ఎదులాపురం, ఆగస్టు 19 : రిమ్స్లో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, నటరాజ్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, రిమ్స్ డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ రోగులకు వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉమేందర్, వైద్యులు తిప్పస్వామి, క్రాంతికుమార్, రిమ్స్ శానిటేషన్ సూపర్వైజర్ అనుదీప్, తదితరులు పాల్గొన్నారు.
దుస్తులు పంపిణీ
తలమడుగు, ఆగస్టు 19 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా సాయిలింగి గ్రామంలోని వృద్ధాశ్రమంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వృద్ధులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జంగాల రేవతి, ఎంపీడీవో రమాకాంత్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జీవన్రెడ్డి, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు కిరణ్ కుమార్, అబ్దుల్లా, ఆశన్న యాదవ్, తదితరులు పాల్గొన్నారు.