నిర్మల్ టౌన్, జూలై 16 : ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆరోగ్యం, ఆహారంపై ప్రత్యేక కమిటీలు వేస్తున్నామని ఉన్నత విద్యాశాఖ వైస్ చాన్స్లర్ వెంకటరమణ అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫా రూఖీతో కలిసి శనివారం విలేకరుల సమావే శం నిర్వహించారు. శుక్రవారం భోజనం చేసి న 120 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో అనారోగ్యానికి గురయ్యారని, వారందరినీ హుటాహుటినా కలెక్టర్ ఆధ్వర్యంలో నిజామాబాద్, భైంసా దవాఖానలకు తరలించామన్నా రు. 24 గంటల్లోనే మెరుగైన వైద్యం అం దించడంతో తిరిగి బాసర ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారన్నారు. ఫుడ్ పాయిజన్కు కారణమైన రెండు ఏజెన్సీలపై ఉన్నత విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాల మేరకు కేసు నమో దు చేశామని చెప్పారు. వైస్ చాన్స్లర్గా తన ను విచారణకు ఆదేశించడంతో శనివారం కళాశాలను సందర్శించి విచారణ చేపట్టామన్నారు. ఫుడ్ ఏజెన్సీల నిర్లక్ష్యం వల్లే ఘటన జరిగిందని, దీనికి బాధ్యులైన వారిపై ప్రభుత్వానికి నివేదించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ట్రిపుల్ ఐటీ విద్యార్థుల భవిష్యత్తుకు ప్రణాళిక ప్రత్యేక ప్రణాళికల రూపొందిస్తామన్నారు. హాస్టల్ వార్డెన్లను కూడా మార్చనున్నట్లు తెలిపారు. వేళకు రెం డుసార్లు ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తామన్నారు. అడ్మినిస్ట్రేషన్ కా ర్యాలయంలో సిబ్బందిని మార్చుతామని, ప్రతిరోజూ గ్రీవెన్ సెల్ ఏర్పాటు చేసి విద్యార్థుల ఫిర్యాదులను స్వీకరిస్తామన్నారు. మంచి హాస్టల్ను, భోజనాన్ని, నీటి సౌకర్యం, పారిశుధ్యం నిర్వహణ, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పె డుతామన్నారు. ఇప్పటికే బాసరకు ప్రభు త్వం రూ. 16 కోట్లను కేటాయించిందని, ఆ నిధులతో విద్యార్థుల డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఘటనను చాలెంజ్గా తీసుకున్నాం..
ఫుడ్ పాయిజన్ కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా చర్యలు తీసుకోవడం వల్లనే వా రు పూర్తిగా కోలుకున్నారని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ఘటన తెలియగా నే తనతో పాటు ఎస్పీ ప్రవీణ్కుమార్, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, బాసర ట్రిపుల్ఐటీ డైరెక్టర్ సతీశ్, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలను అక్కడికి తరలించి అస్వస్థతకు గురైన విద్యార్థులను ప్రథమ చికిత్స అనంతరం నిజామాబా ద్, భైంసా దవాఖానలకు తరలించామని చె ప్పారు. ఘటనలు మరోసారి జరగకుండా పటి ష్ట చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
దేవుడిపై భారంతోనే గండం గట్టెక్కింది..
కడెం ప్రాజెక్టు దేవుడిపై భారంతోనే గట్టెక్కిందని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం 200మి.మీటర్లు కాగా.. ఇప్పటికి 750 మి.మీటర్ల వర్షపాతం కురవడంతో కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో 6 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరడం వల్ల నిండిపోయిందన్నారు. ఇన్ఫ్లో, ఔట్ప్లో కంటే రెండింతలు కావడంతో ఆనకట్టకు ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో అధికారులను అ ప్రమత్తం చేసి ఏడు గ్రామాల ప్రజలను హుటహుటినా సురక్షిత ప్రాంతాలకు తరలించి ఏ ర్పాట్లు చేశామని చెప్పారు. వరద బాధితులకు పది కిలోల బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను అందిస్తామన్నారు. ఏవో శివప్రసాద్, డీపీఆర్వో తిరుమల ఉన్నారు.