డివిజన్ల వారీగా కంట్రోల్ రూంల ఏర్పాటు
విద్యుత్ శాఖ జిల్లా అధికారి జయంత్రావుచౌహాన్
నిర్మల్ టౌన్, జూలై 22 : భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా విద్యుత్ శాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తు న్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి జయంత్రావు చౌహాన్ తెలిపారు. గురువారం సర్కిల్ కార్యాల యం లో ఆయా డివిజన్ల అధికారులతో మాట్లాడి విద్యుత్ వినియోగదారు లకు ఎలాంటి ఇబ్బం దులు జరు గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు, వరదలు ఉధృతంగా ప్రవహించి విద్యుత్ స్తంభాలు కిందప డిపోవడం, వైర్లు తెగిపోవడం, ఇంట్లో వర్షానికి తడిసిన ఇండ్లకు షార్ట్సర్క్యూట్ వచ్చే ప్రమాద ముందని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లాలో ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి 24 గంటల పాటు సేవ లు అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడ సమ స్య ఉన్నా వినియోగదారులు 7901628368 నంబర్లో సంప్రదించాలన్నారు. నిర్మల్ జిల్లా పరి ధిలో ఖానాపూర్ సబ్ డివిజన్లో ఖానాపూర్, పెంబి, కడెం, దస్తురాబాద్, మామ డ మండలాల పరిధిలో డివి జనల్ ఇంజినీర్ ఈదన్న ఫోన్ 9440811 693 సంప్రదించాలన్నారు. కల్లూ రు, కుభీర్ మండలాల విద్యుత్ విని యోగదారులు భైంసాలో ఉన్న కైస ర్ ఫోన్ 9440811688లో సంప్ర దించాలన్నారు. బాసర సబ్ డివిజ న్లో బాసర, ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాలకు అసిస్టెంట్ ఇంజినీర్ లక్ష్మి ఫోన్ 83411725 754 నంబర్ లో సంప్రదించాలన్నారు. అలాగే నిర్మల్ పట్టణంలోని 42 వార్డులకు సంబంధిం చిన ప్రజలు టౌన్ పరిధిలోని ఏడీ రవి ఫోన్ 9440811687లో సంప్రదించాలని సూచించా రు. నిర్మల్ రూరల్ పరిధిలోని లక్ష్మణచాంద, మా మడ, దిలావర్పూర్ రంగస్వామి ఫోన్ 6281 948966 నంబర్లో సంప్రదించాలని సూచించా రు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఉన్న ఫోన్ లో సమాచారమందించాలని కోరారు.