55 గురుకులాలు.. 4,400 సీట్లు..
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు..
ఎదులాపురం/నిర్మల్ అర్బన్, జూలై 17 : గురుకుల పాఠశాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్షకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ,బీసీ సాధారణ గురుకుల విద్యాలయాల్లో 2021-22 సంవత్సరంలో ఐదో తరగతిలో ప్రవేశాలకు ఈనెల ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తం గా 55 గురుకులాల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు పెద్ద సంఖ్య లో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కొవిడ్ ను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాల గదులను శానిటైజేషన్ చేయించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్కు, శానిటైజర్, వాటర్ బాటిళ్ల తో రావాలని సూచిం చారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ను అమలు చేయనున్నారు. tgcet. cgg. gov. in నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏర్పాట్లు పూర్తి
టీజీ సెట్ నిర్వహణకు కోసం అన్ని ఏర్పాట్లు చేశాం. విద్యార్థులు ఉదయం 10 గంటల వరకే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్ష నిర్వహిస్తున్నాం. తరగతి గదిలో కేవలం 20 మంది విద్యార్థులు కూర్చునేలా ఏర్పాట్లు చేశాం. ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఆశ, ఏఎన్ఎం, పోలీస్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్తో చేతులు శుభ్రం చేసిన తర్వాతే లోపలికి అనుమతి ఇస్తాం.
కొప్పుల స్వరూపారాణి, ఎస్సీ గురుకులాల ఉమ్మడి జిల్లా ఆర్సీవో
పకడ్బందీగా ఏర్పాట్లు
జిల్లాలోని పది ఎస్సీ,ఎస్టీ,బీసీ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. విద్యార్థుల హాల్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచాం. పరీక్షల నిర్వహణకు జిల్లాలో మొత్తం 13 కేంద్రాలు ఏర్పాటు చేశాం. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మాస్కు, శానిటైజర్, వాటర్ బాటిల్తో హాజరు కావాలి. మొత్తం 3665 మంది పరీక్షకు హాజరుకానున్నారు.
-శివరాం, నిర్మల్ జిల్లా రూట్ ఆఫీసర్