నిర్మల్ టౌన్, జూలై 16 : తెలంగాణ సర్కారు కృషితోనే క రోనా ఒకటి, రెండు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, థర్డ్వేవ్పై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జడ్పీ కార్యాలయంలో శుక్రవారం చైర్పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. అన్ని దేశాల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలోని ఏరియా దవాఖానలో కావాల్సిన సదుపాయాలు సమకూర్చుకోవాలని సూచించారు. క రోనా నియంత్రణకు నిరంతరం టీకా అందించాలన్నారు. వై ద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేస్తున్నదని వెల్లడించారు. రూ.3 కోట్లతో డయాగ్నోస్టిక్ సెంటర్ను నొలకొల్పి 57 రకాల ఉచిత పరీక్షలు చేస్తున్నట్లు చెప్పారు. మరో నెల రో జుల్లో ఆర్టీపీసీఆర్ సెంటర్ ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏఈలు సక్రమంగా పనిచేయడంలేదని ఎస్ఈ దృష్టికి తెచ్చారు.
రెండు రోజుల్లో సమావేశం ఏ ర్పాటు చేసుకొని, అందరూ పనిచేసేలా చూడాలన్నారు. పం చాయతీరాజ్, ఆర్అండ్బీ ద్వారా మంజూరైన నిధులు, ప్రా రంభించిన, పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అడెల్లి-బోథ్ రోడ్డును వెంటనే ప్రారంభించాలని సూచించారు. మిషన్ భగీరథ నీటిని ఇంటింటికీ అందించాలని ఆదేశించారు. జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఇటీవల తెలంగాణ సర్కారు చేపట్టిన పల్లె ప్రగతి, హరితహారంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటామని, వాటిని సంరక్షించాలన్నారు. గ్రామాల్లోని సమస్యలను తెలుసుకునేందుకు పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బాశెట్టి సాగరాబాయి, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, వివిధ శాఖల అధికారులు దేవేందర్, ధన్రాజ్, డాక్టర్ దేవేందర్, రాజేశ్వర్, సృజన్కుమార్, కిరణ్కుమార్, అంజిప్రసాద్, శరత్బాబు, అశోక్కుమార్, శ్రీనివాస్రావు, జయంత్రావు చౌహాన్, శంకరయ్య, శ్రీనివాస్రెడ్డి, అశ్వక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు డాక్టర్ సుభాష్రావు, రఫీక్ అహ్మద్, స్థాయీ సంఘం చైర్మన్లు, సభ్యులు గంగామణి, కళావతి, శారద, జానాబాయి, ఆకుల సరస్వతి, జీవన్రెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు.