బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి
ఉట్నూర్ మండలంలో పర్యటన
ఉట్నూర్ / ఉట్నూర్ రూరల్, జూలై 14 : బాలల హక్కుల రక్షణే తమ లక్ష్యమని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శోభారాణి అన్నా రు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం మం డలంలోని దంతన్పెల్లి, కొలాంగూడ గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూ చించారు. అనంతరం కుమ్రంభీం ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏజెన్సీలోని గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు పౌష్టికాహారం, విద్య, వైద్యం సక్రమంగా అందించేందుకు బాల అదాలత్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందులో ఐదుగురు స భ్యులతో కూడిన మెజిస్ట్రేట్ బృందం ఉంటుందన్నారు. పిల్ల ల సమస్యలపై వచ్చిన అర్జీలను అక్కడికక్కడే పరిష్కరిస్తామని పేర్కొన్నారు. కమిషన్ ఆధ్వర్యంలో మొదటగా ఏజెన్సీ కేంద్రాల్లో బాల అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. మొదటగా కొత్తగూడెం ఐటీడీఏ ప్రాంతంలో నిర్వహించామని, రెండోసారి ఉట్నూర్ ఐటీడీఏ కేంద్రంలో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ మిగతా ఐటీడీఏల్లో నిర్వహిస్తామన్నారు. నేటి అదాలత్ను సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా వివిధ సమస్యల తో రాకున్నా తమ కార్యాలయ ఫోన్ నంబర్లను బాల అదాలత్లో ప్రదర్శిస్తామని, వాటికి ఏ అధికారితోనైనా, స్వయంగానైనా అందించవచ్చన్నా రు. బాలల పరిరక్షణకు, హక్కుల కోసం ఎల్లప్పు డూ పనిచేస్తామన్నారు. ఆమెవెంట జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి రాజేంద్రప్రసాద్, సీడీపీవో శ్రావణి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జిల్లా చైర్మన్ వెం కటస్వామి, సభ్యులు సమీర్ ఉల్లాఖాన్, దశర థం, డేవిడ్, సర్పంచ్ భూమన్న, చైల్డ్ ప్రొటక్షన్ అ ధికారి స్వామి, అంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.