నిర్మల్ టౌన్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సహకారంతో జిల్లాలో గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్నానని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎరవోతు రాజేందర్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ గ్రంథాలయ భవనంలో జిల్లా గ్రంథాలయ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రంథాలయాల ఆధునీకరణ, ఈ గ్రంథాలయ ఏర్పాటుకు చర్యలు తీసుకుందన్నారు. కలకత్తాకు చెందిన రాజ్మోహన్రాయ్ గ్రంథాలయ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ప్రభుత్వం కోటి 50లక్షలతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు తీర్మాణించామని వెల్లడించారు. అంబేద్కర్ భవనం పక్కన ఉన్న 8 గుంటల ప్రభుత్వస్థలాన్ని కేటాయించామని, గ్రంథాలయ భవనంపై రూ.20లక్షలతో అంతస్తు భవనం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా మండలాల్లో ఉన్న గ్రంథాలయల నిర్వహణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యదర్శి లక్ష్మిరాజ్యం, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, డీపీఆర్వో ఉమరాణి, విద్యాశాఖ సెక్టోరియల్ అధికారి సులోమికరుణ తదితరులున్నారు.