ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి
కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ
బాసర, ఫిబ్రవరి 13 : కల్యాణలక్ష్మి పథకం పేదలకు అండగా నిలుస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. బాసర తహసీల్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఆదివారం ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అంద జేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తు న్నదని తెలిపారు. 73 మంది లబ్ధిదారులకు చెక్కు లను అందజేశారు. ప్రజాప్రతినిధులు, నాయ కులు, అధికారులు పాల్గొన్నారు.
దశల వారీగా గ్రామాలాభివృద్ధి
ముథోల్, ఫిబ్రవరి 13 : దశల వారీగా గ్రామా ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. సీడీపీ నిధులు రూ. 2.50 లక్షలతో చేపట్టనున్న ముథోల్ నుంచి హంగిర్గకు వెళ్లే వ్యవసాయ దారి నిర్మాణ పనులు, కోలి గల్లిలో ఉపాధి హామీ నిధులు రూ. 5 లక్షల తో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి ఆదివారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దవాఖాన నూతన భవనా నికి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. విద్యా ర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని డిగ్రీ కళా శాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొ న్నారు. స్థానిక సర్పంచ్ రాజేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మున్నూరుకాపు తాలుకా అధ్యక్షుడు రోళ్ల రమేశ్, నాయకులు శ్రీని వాస్ గౌడ్, భూమేశ్, కోఆప్షన్ సభ్యులు మగ్దూమ్, పోతన్న యాదవ్, వార్డు సభ్యులు సంతోష్, సంజు, సమీ ఉల్లాఖాన్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పరామర్శ
కుంటాల, ఫిబ్రవరి, 13 : లింబా(బీ) గ్రామా నికి చెందిన సీనియర్ న్యాయవాది ఠాగూర్ రవీందర్ సింగ్ నానమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. బాధిత కుటుంబాన్ని ఆదివారం టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకొని కుటుంబ సభ్యుల కు సానుభూతి తెలిపారు. రవీందర్ సింగ్ కుటుం బసభ్యుడు హీరాసింగ్ అనారోగ్యంతో దవాఖా నలో చేరగా రూ.1.35 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరైంది. వారి కుటుంబానికి ఎమ్మెల్యే చెక్కు అందజేశారు.