మంచిర్యాల, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరువైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత మరింత పెరిగింది. గత మూడు రోజులుగా ఉమ్మడి జిల్లాలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలోనే అత్యధికంగా బుధవారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
మంచిర్యాల జిల్లా కోటపల్లిలో 46.3, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.3, ఆదిలాబాద్ జిల్లా జైనథ్లో 46.2 డిగ్రీలతో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న నాలుగైదు రోజుల పాటు ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వేడి గాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉదయం 10 గంటల నుంచే సూర్యప్రతాపం మొదలవుతున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల దాకా అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.