ముథోల్, మార్చి 4 : దళిత బహుజనుల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ అందరికీ ఆదర్శప్రాయుడని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని శుక్రవారం మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్తో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బహుజనుల హక్కుల కోసం సర్వాయి పాపన్న పోరాడారని పేర్కొన్నారు. ఆయన జీవిత చరిత్ర ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం. మోకు దెబ్బ జాతీయ అ ధ్యక్షుడు నర్సాగౌడ్ మాట్లాడుతూ.. హక్కుల సాధన కోసం గౌడ సోదరులు ఐక్యంగా ముందుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మోకుదెబ్బ జిల్లా ప్ర ధాన కార్యదర్శి దోరా రామాగౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ చైర్మ న్ వెంకటేశ్ గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ లక్ష్మీ నర్సాగౌడ్, స ర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, తహసీల్దార్ శ్యాంసుందర్, ఎంపీడీవో సురేశ్ బాబు, ఎంపీటీసీలు దేవోజీ భూమేశ్, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఏ ఎంసీ మురళీగౌడ్, డా. ముష్కం రామకృష్ణ గౌ డ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా కార్యదర్శి ఫ ణీందర్ గౌడ్, విగ్రహ దాత దేవేందర్ గౌడ్, ఏ మురళీ గౌడ్, అంజాగౌడ్, నగేశ్గౌడ్, శంకర్ గౌ డ్, సత్యనారాయణ గౌడ్, కనకాగౌడ్, స్వామిగౌ డ్, పోతన్నయాదవ్, రమేశ్, ఖలీద్, దత్తుగౌడ్, దేవేందర్ గౌడ్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.