ఆరోగ్య శిబిరాన్ని పరిశీలించిన కలెక్టర్
పరిసరాల సందర్శన
బాసర, జూన్ 23 : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గురువారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య పరీక్షలను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ పరిశీలించారు. పరీక్షల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఆరోగ్య స్థితిగతుల గురించి వైద్య సిబ్బందితో చర్చించారు. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అనంతరం ట్రిపుల్ ఐటీ పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, అధికారులు ఉన్నారు.