సోన్, అక్టోబర్ 18: గత తొమ్మిదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ గడపగడప కూ వెళ్లి ఓట్లను అభ్యర్థించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి, నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యాగార్డెన్లో బుధవారం నిర్వహించిన నిర్మల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో బూత్ కమిటీలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మూడోసారి విజయం ఖాయమని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవడమే కాకుండా ఇవ్వని హామీని సైతం అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. అన్ని గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి తాను వస్తానని నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలపై ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామాల్లో ప్రచారం చేయాలని కోరారు. ఎఫ్ఏసీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, నిర్మల్ ఎంపీపీ కొరిపెల్లి రామేశ్వర్రెడ్డి, బీఆర్ఎస్ నిర్మల్ కన్వీనర్ గోవర్ధన్రెడ్డి, అల్లోల మురళీధర్రెడ్డి, తిరుపతిరెడ్డి, గౌతంరెడ్డి, మహేశ్రెడ్డి, నాయకులు పాకాల రాంచందర్, చంద్రశేఖర్గౌడ్, పడకంటి రమేశ్రెడ్డి, మల్లేశ్యాదవ్, సూరపు సాయన్న, గాండ్ల విలాస్ఉన్నారు.