నిర్మల్ టౌన్, డిసెంబర్ 14: ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని నిర్మల్ కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖలలో అమలవుతున్న వివిధ అభివృద్ధి పథకాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించాలని సూచించారు. పోషకాహారలోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేకంగా పోషకాహారం అందించాలన్నారు.
అంగన్వాడీ సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలన్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా పీహెచ్సీల పరిధిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు ఇంటింటా సర్వే నిర్వహించి రోగాల బారిన పడకుండా ప్రజలకు జాగ్రత్తలు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా శిశు సంక్షేమశాఖ అధికారి రమేశ్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ధన్రాజ్ పాల్గొన్నారు.