భైంసా, ఫిబ్రవరి 25 : అర్హులైన వారికే డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని నిర్మల్ అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. భైంసా పట్టణంలోని 23 వార్డుల్లో శనివారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని మున్నూరుకాపు సంఘం 9వ వార్డు, 4వ వార్డులో దరఖాస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లిస్టులో అర్హులైన వారి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అన్ని అర్హతలున్న వారికే ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయాలని సూచించారు. ఈయన వెంట రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు.