బాసరలో నవరాత్రోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిసాయి. చివరి రోజు సరస్వతీ అమ్మవారు సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు భక్తులు దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఉదయం పూర్ణహుతి కార్యక్రమం అనంతరం అమ్మ వారి నవరాత్రోత్సవాలకు అర్చకులు ముగింపు పూజలు చేశారు.
– బాసర, అక్టోబరు 4