సోన్, ఏప్రిల్ 7: రాష్ట్ర ప్రభుత్వం పల్లెల్లో ఏర్పాటు చే స్తున్న ప్రకృతి వనాలను పిక్నిక్ పార్కులుగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండలం పాక్పట్లలో గోదావరి తీరాన రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని మంత్రి అల్లోల గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పదెకరాల విస్తీర్ణంలో సుమారు 60 వేల మొక్కలతో ఈ ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల జీవన విధానం ప్రకృతితోనే ఆధారపడి ఉందన్నారు.
పాక్పట్ల శివారులో పాత గోదావరి ప్రాంతంలోని నీటిలో మొసళ్ల సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. పాత గోదావరి తీరంలోని మొసళ్ల కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ ప్రాంతంలో మొసళ్లు ఉండగా.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం ఉపాధిహామీ కూలీలలతో మంత్రి, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ మాట్లాడారు.
సోన్ మండల కేంద్రంలో ప్రయోగత్మకంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పర్ణశాలతో పిల్లల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. సోన్ మండల కేంద్రంలో రూ.1.23లక్షలతో ఏర్పాటు చేసిన మోడల్ పర్ణశాలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు చదువుతో పాటు మానసిక వికాసానికి ఈ పర్ణశాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు పిల్లలకు పర్ణశాలలో మోడల్ ఆట వస్తువులను అందుబాటులో ఉంచడం వల్ల రెండు గంటల పాటు కాలక్షేపం చేయవచ్చన్నారు. రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లాలో మొదటిసారి అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే ప్రత్యేక కృషితో ఈ మోడల్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సర్పంచ్ తిరుక్కోవెల వినోద్కుమార్ సహకారంతో దీన్ని అందంగా, ఆకర్శణీయంగా తీర్చిదిద్దినట్లు చెప్పారు. కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, డీఆర్డీవో విజయలక్ష్మి, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జడ్పీటీసీ జీవన్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్రెడ్డి, సర్పంచ్ ఎల్చల్ గంగారెడ్డి, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మహేందర్రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, తహసీల్దార్ ఆరిఫా సుల్తానా, ఎంపీడీవో సాయిరాం, ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ మధుకర్రెడ్డి, ఈజీఎస్ ఏపీవో మంజుల, ఎంపీటీసీ దాసరి లింగవ్వ శ్రీనివాస్, కార్యదర్శులు సంధ్య, లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు ఎల్చల్ రమేశ్రెడ్డి, లెంక వినోద్, పత్తి ప్రదీప్ పాల్గొన్నారు.