తాండూర్ : తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ దేశ వ్యాప్తంగా ఈ నెల 20న నిర్వహిస్తున్న మెడికల్ షాపుల బంద్ ( Medical Shops Bandh ) ను విజయవంతం చేయాలని తెలంగాణ మెడికల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తాండూర్ మండల అధ్యక్షుడు జగన్మోహన్ చారి ( President Jaganmohan Chary ) కోరారు.
తాండూర్ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్ లో హోల్సేల్, రిటైల్ షాపుల యాజ మాన్యాలు సమ్మెలో పాల్గొంటున్నాయని వివరించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఆన్లైన్ మెడిసిన్ విక్రయాల నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
2018 నుంచి ఇప్పటి వరకు అనేకసార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించినా ఆన్ లైన్ మెడిసిన్ విక్రయాలు నిలిపివేయడం లేదన్నారు. వెంటనే కెమిస్ట్, డ్రగ్గిస్ట్ నిబంధనలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న విక్రయాలను నిలిపివేయాలని కోరారు. . వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయోటిక్ మందుల విక్రయాలు ప్రజలకు ప్రమాద కరమని పేర్కొన్నారు.
దేశ వాప్తంగా 40 లక్షలు, రాష్ట్రంలో 14 లక్షల హోల్సేల్, రిటైల్ షాపులున్నాయని, వీటిపై ఆధారపడి కోట్లాది యువత, ప్రజలు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. బంద్ సందర్భంగా ప్ర జలకు ఇబ్బంది కలుగకుండా అత్యవసర వైద్య సేవల మందులు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు 93475 51355, 98660 04480 ద్వారా సంప్రదించాలని కోరారు. అనంతరం కరపత్రాలు విడుదల చేసి తహసీల్ , సర్కిల్ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో తాండూర్ మండల ప్రధాన కార్యదర్శి తాటిపాముల రాంప్రసాద్, ఉపాధ్యక్షుడు భోగె శ్రీకాంత్, కార్యవర్గ సభ్యులు మామిడాల రాజేశం, బొంతల తిరుపతి, నేరెళ్ల కుమార్, గందే వెంకటరమణ, పాల్గొన్నారు.