భైంసా, జూన్ 21 : ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. భైంసా పట్టణంలోని కాలోనీలో బుధవా రం బస్తీ దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆరోగ్యకేంద్రాల నుంచి పెద్దాసుపత్రుల వరకు అన్నిం ట్లో పరిశుభ్ర వాతావరణాన్ని ఏర్పాటు చేసి అన్ని రకాల సేవలందిస్తున్నారన్నారు. కంటి వెలుగు కా ర్యక్రమం ద్వారా పరీక్షలు నిర్వహించి అవసరమై న వారికి అద్దాలను అందించారన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము, డిప్యూటీ డీఎంహెచ్వో ఇద్రిజ్, హెల్త్ సూపర్వైజర్ ఖలీం, డాక్టర్ మతీన్, బీఆర్ఎస్ నాయకులు భోజారాం, సాయినాథ్, వాసే, ఖాలీద్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
భైంసా పట్టణంలోని మార్కండేయ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రూ.40 లక్షల ప్రొసీడింగ్ కాపీని అందజేశారు. ఈ కార్యక్రమం లో పద్మశాలీ సంఘం భైంసా పట్టణాధ్యక్షుడు మహేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జేకే పటేల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు ఫారూఖ్ హైమద్, ప్రధాన కార్యదర్శి తోట రాము, పద్మశాలీ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ముథోల్, జూన్ 21 : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని గన్నోరా గ్రామంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న గ్రామపంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతితో పాటు గ్రామాల అభివృద్ధికి సైతం నిరంతరం కృషి చేస్తున్నదని వివరించారు.
యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లో కలెక్టర్ ఆదేశానుసారం నిర్మించిన రీడింగ్ రూమ్నుఆయన ప్రారంభించారు. యువ తీ, యువకులు రీడింగ్ రూమ్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తమవంతుగా నిధులిచ్చి సహకరించిన ఎంపీపీ అయేషా అఫ్రోజ్ఖాన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యేను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, ముథోల్ సర్పంచ్ రాజేందర్, కోఆప్షన్ సభ్యుడు మగ్దూమ్, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, మురళి, రవి కిరణ్ గౌడ్, సర్పంచ్లు పాల్గొన్నారు.
కుభీర్, జూన్ 21 : మండలంలోని పార్డి(బీ) గ్రామానికి చెందిన రైతులు కండికే రాము, తూం శంకర్ వివిధ కారణాలతో మృతి చెందారు. వారి నామినీలైన కండికే లక్ష్మీబాయి, తూం ఆనందబాయికి రూ.5 లక్షల విలువైన బీమా పరిహారం చె క్కులను ఎంపీపీ తూం లక్ష్మి, సర్పంచ్ తూం పుష్పలత, బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్తో కలిసి ఎమ్మెల్యే అందజేశారు. తహసీల్దార్ బత్తుల విశ్వంభర్, ఏఈవో సాయినాథ్, జేపీఎస్ కమల్ సింగ్, ఉప సర్పంచ్ తుకా రాం, జీ బాబు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు శేరి సురేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.