ముథోల్, ఫిబ్రవరి 9 : అన్ని వర్గాల అభ్యున్న తికి తెలంగాణ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్న దని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ముథోల్లోని తహసీల్దార్ కార్యాల యంలో లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి నిరుపేదలకు వరమని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. ముథో ల్కు డిగ్రీ కళాశాల మంజూరు చేయించామ ని పేర్కొన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతుగా ఎల్లవేళలా కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, తహసీల్దార్ శ్యాంసుందర్, స్థానిక సర్పంచ్ రాజేం దర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అఫ్రోజ్ ఖాన్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సురేందర్ రెడ్డి, నాయకులు పోతన్న యాదవ్, మున్నూరుకాపు తాలుకా అధ్యక్షుడు రోళ్ల రమేశ్, మగ్దూమ్, గిరిధవార్ అభిమన్యు, రవీందర్రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
తానూర్, ఫిబ్రవరి 9 : ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి వరమని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రె డ్డి పేర్కొన్నారు. తానూర్లో పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద లబ్ధ్దిదారులకు మంజూరైన చెక్కులను ఆయన జడ్పీ వైస్ చైర్మెన్ బాశెట్టి సాగరబాయితో కలిసి పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, భైంసా ఏఎంసీ చైర్మన్ పిప్పెర కృష్ణ, ఆత్మ చైర్మన్ పోతారెడ్డి, వైస్ ఎంపీపీ చంద్రకాంత్, తహసీల్దార్ వెంకట రమ ణ, ఎంపీడీవో గోపాలకృష్ణారెడ్డి, తాడేవార్ విఠల్, నాయకులు పాల్గొన్నారు.
భైంసా, ఫిబ్రవరి 9 : సారంగాపూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన రాజకీయ కురు వృద్ధుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు మాజీ మంత్రి పీ నర్సారెడ్డిని హైదరా బాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో బుధవారం ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పరామ ర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.