భైంసాటౌన్, డిసెంబర్ 5 : పేదలకు అత్యవసర చికిత్స సమయంలో సీఎంఆర్ఎఫ్ వరంలాంటిదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రూ.5 లక్షల విలువ గల సీఎంఆర్ఎఫ్ సహాయనిధి చెక్కులను సోమవారం ఆయన అందించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మేరాజ్, చంద్రకాంత్, పీఏసీఎస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు భూమారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ చాకేటి లస్మన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.