ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఈద్ ఉల్ ఫితర్ను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈద్గాలు, మసీదుల వద్ద సామూహిక ప్రార్థనలు చేసి, మత పెద్దల సందేశాలను విన్నారు. పలుచోట్ల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, రేఖానాయక్, విఠల్ రెడ్డి, జోగు రామన్న, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జడ్పీ చైర్మన్లు కోవ లక్ష్మి, రాథోడ్ జనార్దన్ పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ఈద్ ఉల్ ఫితర్ను ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం సాయంత్రం ముగిశాయి. శనివారం ఉదయం ఈద్గాలు, మసీదుల వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సందేశాలను శ్రద్ధగా విన్నారు. ఒకరికొకరు అలయ్.. బలయ్ తీసుకున్నారు. అనంతరం బంధువులు, స్నేహితులను ఇళ్లకు ఆహ్వానించి విందు ఇచ్చారు. నిర్మల్ పట్టణ శివారులో కొత్తగా నిర్మించిన ఈద్గా వద్ద మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.
బోథ్లోని ఈద్గా వద్ద ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్, భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద గల ఈద్గా వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఊట్నూర్లో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆదిలాబాద్లోఎమ్మెల్యే జోగు రామన్న, బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రిలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, కోటపల్లి మండలం షట్పల్లిలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, మంచిర్యాలలో ఎమ్మెల్యే దివాకర్రావు, యువ నాయకుడు విజిత్రావు, కాగజ్నగర్లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, చింతగూడ కోయవాగులో జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, కోనేరు చారిటబుల్ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ, జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర్రావు, డీఎస్పీ కరుణాకర్, ఆసిఫాబాద్లో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఆయాచోట్ల పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. – నమస్తే బృందం