మంచిర్యాలటౌన్, మార్చి 27: ఆస్తిపన్ను చెల్లించని దుకాణానికి మున్సిపల్ సిబ్బంది తాళం వేశారు. వెంటనే స్పందించిన భవన యజమాని ఐత శ్రీనివాస్ పన్ను చెల్లించడంతో తాళాలు తెరిశారు. మెయిన్రోడ్డులో మోర్ మార్కెట్ను నిర్వహిస్తున్న భవనానికి సంబంధించిన ఆస్తిపన్ను రూ. 1.41 లక్షలు ఉండడంతో, పలుమార్లు మున్సిపల్ సిబ్బంది యజమానిని కలిసి పన్ను చెల్లించాలని కోరారు.
అయినా కాలయాపన చేస్తుండడంతో, షెట్టర్లకు మున్సిపల్ సిబ్బంది తాళాలు వేశారు. మూడు గంటల వ్యవధిలో పన్ను మొత్తాన్ని చెల్లించడంతో తాళాలు తెరిచారు. మున్సిపల్ మేనేజర్ విజయ్కుమార్, రెవెన్యూ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ఐ మజార్, సిబ్బంది పాల్గొన్నారు.