ఎదులాపురం, నవంబర్ 26 : ప్రభుత్వ దవాఖానలో మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లోని రిమ్స్లో టిఫా స్కానింగ్ యంత్రాన్ని శనివారం డైరెక్టర్ రాథోడ్ జైసింగ్, డీఎంహెచ్వో రాథోడ్ నరేందర్తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ జాదవ్ ఉపేందర్, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్, ప్రసూతి విభాగం హెచ్వోడీ డాక్టర్ పద్మిని, ఆర్ఎంవో చందు, తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ప్రాంరభం
యువత నైపుణ్యానికి వెలికి తీసే ప్రయత్నంగా క్రీడలను ప్రోత్సహిస్తున్నామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. ఆదిలాబాద్లోని బెల్లూరి చాందా స్డేడియంలో శనివారం నిర్వహించిన జోగు ఆశన్న, భోజమ్మ స్మారక క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆవుల వెంకన్న, నిర్వాహకులు యుసూప్, హైమద్, తదితరలు పాల్గొన్నారు.
స్లాటర్ హౌస్ పనుల పరిశీలన
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 26 : ఆదిలాబాద్లోని శాశ్వత పశువదశాల నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని నిషాన్ ఘాట్ వద్ద స్లాటర్ హౌస్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని పురపాలక అధికారులతో కలిసి పరిశీలించారు. స్లాటర్ హౌస్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన స్థలాన్ని పరిశీలించి పనుల వివరాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ స్లాటర్ హౌస్ కోసం ప్రతిపాదించిన స్థలంలో పనులను త్వరలోనే ప్రారంభించి అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. గతంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతో రూ.కోటి 50 లక్షలతో వంతెన నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. డీటీసీపీ ప్లాన్ ప్రకారం పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ శైలజ మాట్లాడుతూ శాశ్వత పశువదశాల లేక ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఎమ్మెల్యే జోగు రామన్న చొరవతో నిషాన్ఘాట్లో ఎకరం రెండు గుంటల స్థలాన్ని పశువదశాల కోసం కేటాయించినట్లు తెలిపారు. త్వరలోనే పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఇంజినీరింగ్ అధికారులు అరుణ్, తిరుపతి, నాయకులు మిషు, వేణుగోపాల్ యాదవ్ పాల్గొన్నారు.
మొక్కులు తీర్చుకున్న మున్సిపల్ చైర్మన్
ఆదిలాబాద్ టౌన్, నవంబర్ 26 : జిల్లా కేంద్రంలోని బెల్లూరి అయ్యప్ప స్వామి ఆలయంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు చేశారు. తన కుమారుడు అద్వైత్ పుట్టినరోజు సందర్భంగా మున్సిపల్ చైర్మన్తో పాటు కుమారుడి నిలువెత్తు బెల్లం తులాభారం చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మూర్తి గురుస్వామి, సూర్యకాంత్, గణేశ్, ఫ్లోర్ లీడర్ సతీశ్, వెంకన్న పాల్గొన్నారు.