ఇచ్చోడ, ఆగస్టు 23 : ‘పల్లె ప్రగతి’ని వంద శాతం సద్వనియోగం చేసుకున్న ముక్రా (కే) గ్రామానికి జాతీయస్థాయి అవార్డు లభించింది. పంజాబ్ రాష్ట్రంలోని చండీగఢ్లో రెండ్రోజులుగా సాగిన జాతీయ స్థాయి వర్క్షాప్ మంగళవారంతో ముగిసింది. ముగింపు రోజున ముక్రా (కే) గ్రామంపై తీసిన వీడియో డాక్యుమెంటరీని ప్రదర్శించారు. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులు, తడి, పొడి చెత్త ద్వారా సేంద్రియ ఎరువుల తయారీతో ఆదాయం సమకూర్చుకుంటున్న తీరును చూసిన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ర్టాల నుంచి పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రశంసల జల్లులు కురిపించారు.
ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ సెక్రటరీ మినిస్టరీ ఆఫ్ పంచాయతీ రాజ్ కార్యదర్శి వివేక్ వర్మ మాట్లాడారు. ముక్రా (కే) గ్రామాన్ని ప్రస్తుతం క్లీన్ అండ్ గ్రీన్గా మార్చిన ఘనత సర్పంచ్ గాడ్గె మీనాక్షికే దక్కిందన్నారు. కొత్తగా ఏర్పడిన జీపీ మూడున్నరేళ్లలో సుమారు రూ.33 కోట్ల అభివృద్ధి పనులతో గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం వైపు పరుగులు పెట్టడం గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు. దేశంలోని అన్ని జీపీలు ముక్రా (కే)ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం ఉత్తమ జాతీయ అవార్డును సర్పంచ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ముక్రా (బీ) ఎంపీటీసీ గాడ్గె సుభాష్, తదితరులు పాల్గొన్నారు.