భీమారం, జనవరి 16 : మండల కేంద్రంలోని జయశంకర్ కాలనీకి చెందిన పిట్టల స్వప్న అయోధ్య రామమందిరం రూపంలో వేసిన ముగ్గు ఆకట్టుకున్నది.
రామ మందిరంపై పక్షులు ఎగురుతున్నట్లు, హరిదాసు పాట పడుతున్నట్లు, ఆ పక్కనే చిన్నారి పతంగి ఎగిరేస్తున్నట్లు వేసిన ముగ్గు వాట్సప్లో వైరల్గా మారింది. స్వప్నను పలువురు అభినందించారు.