బైంసా, సెప్టెంబర్ 1 : బాధితులకు సీఎం సహాయనిధి భరోసానిస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని భట్టిగల్లికి చెందిన పెండెపు కళావతికి రూ.60 వేలు, సాయినాథ్కు రూ.12 వేలు, ప్రవళికకు రూ.18 వేల సీఎంఆర్ఎఫ్ మంజూరవగా, శనివారం వారికి ఎమ్మెల్యే చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట రాము, వై శ్రీను, విఠల్, లక్ష్మణ్, శ్రీనివాస్, పురస్తు చిన్నన్న తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని భట్టిగల్లిలో మున్నూరుకాపు కల్యాణ మండప నిర్మాణానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. కల్యాణ మండపానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ రాజేశ్వర్, శ్రీనివాస్, గోపాల్, భోసి లక్ష్మణ్, విఠల్, కౌన్సిలర్ కపిల్, అల్లం సాయినాథ్, పెరుగు బాబు తదితరులు పాల్గొన్నారు.