కుభీర్, డిసెంబర్ 29 : రైతులు, ప్రభుత్వానికి మ ధ్య రైతు వేదికలు వారధిగా నిలుస్తున్నాయని ము థోల్ ఎమ్మెల్యే జీ విఠల్రెడ్డి అన్నారు. మండలంలోని పార్డీ(బీ) గ్రామంలో రూ.22 లక్షలతో ని ర్మించిన రైతువేదిక నూతన భవనాన్ని సర్పంచ్ తూము పుష్పలత, ఎంపీపీ తూము లక్ష్మి, ఏవో వికార్అహ్మద్, రైతుబంధు సమితి అధ్యక్షుడు శేరి సురేశ్తో కలిసి గురువారం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు రూ.5.5 లక్షలతో ని ర్మించిన విశ్వబ్రాహ్మణ సంఘం నూతన భవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను పంజాబ్తో ఇతర రాష్ర్టాల సీఎంలు అభినందిస్తున్నారన్నారు. వ్యవసాయానికి నిరంతరం ఉచిత విద్యుత్, రైతుబంధు, బీమా లాంటి పథకాలతో రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నార్నారు. అ నంతరం రైతుబంధు సమితి అధ్యక్షుడు శేరి సురేశ్ను శాలువాతో సత్కరించారు. వైస్ ఎంపీపీ మొ హియొద్దీన్, మాజీ సర్పంచ్లు వడ్ల రాజన్న, వీ.మోహన్, మల్లన్న, ఉప సర్పంచ్ తుకారాం, మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ రేకుల గంగాచరణ్, ఏఎంసీ చైర్మన్ కందుర్ సంతోష్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహాన్, మేరు సంఘం జిల్లా ఉపాధ్యక్షు డు పోల్కంవార్ నరేందర్, వడ్ల లక్ష్మణ్, రైతులు, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
కుంటాల, డిసెంబర్, 29 : మండలంలోని పెంచికల్పాడ్, కల్లూర్ తదితర గ్రామాలకు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ మంజూరు కాగా తన నివాసంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి మండల బీఆర్ఎస్ నాయకులకు చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మం డల కన్వీనర్ పడకంటి దత్తు, నాయకులు కొత్తపల్లి బుచ్చన్న, రమణగౌడ్, ఎస్కే ఖదీర్, గంగన్న, తదితరులు ఉన్నారు. అలాగే ఓల అనుబంధ గ్రా మం రాజాపూర్లో రతన్కు రూ. 17 వేల చెక్కు ను స్థానిక బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. బీఆర్ఎస్ నాయకులు హైమద్ పాషా, దత్తు, రవి, నర్సింలు, రాజేశ్వర్ ఉన్నారు.
ముథోల్, డిసెంబర్, 29 : మండలకేంద్రంలోని బాసర – భైంసా రహదారి నుంచి వ్యవసాయ చేనులకు వెళ్లే గన్నోరా రోడ్డు పనులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు చేనులకు వెళ్లేందుకు జడ్పీ నిధులు రూ. 2.50 లక్షలు మం జూరయ్యాయన్నారు. ఈ సందర్భంగా నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యేను రైతులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఖాలీద్, సర్పంచ్లు రాజేందర్, సాయినాథ్, విజేశ్, నాయకులు శ్రీనివాస్ గౌడ్, పోత న్న, యాదవ్, బాబు కిష్టయ్య, మైసా జీ, వీడీసీ అధ్యక్షుడు బాబన్న, రైతులు రాజులు, భూమేశ్, సురేశ్, దశరథ్ పాల్గొన్నారు.