ఉట్నూర్, డిసెంబర్ 6 : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సేవలు మరువ లేనివని ఎంపీపీ పంద్ర జైవంత్రావు పేర్కొ న్నారు. బుధవారం మండలం కేంద్రంలోని ఎంపీ డీవో కార్యాలయంలో అంబేద్కర్ 67వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలల వేసి నివాళులర్పించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి ప్రజలకు హక్కులు, విధు లు కల్పించారన్నారు.
ఎంపీడీవో తిరుమల, వైస్ ఎంపీపీ బాలాజీ, ఈజీఎస్ ఎపీవో రజినీ కాంత్, సర్పంచ్ హరినాయక్, ధర్మనాయక్, ఎంపీటీసీ లు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కందుకూరి రమేశ్, ఆశన్న, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబే ద్కర్ వర్ధంతిని మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ వాగ్మారే జగ్జీవన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలల వేసి నివాళు లర్పించారు. పీఏసీఎస్ చైర్మన్ సామ ప్రభాకర్ రెడ్డి, నాయకులు ప్రజ్ఞాశీల్, బండి విజయ్, కాటం రమేశ్, కొల్లూరి స్వామి, వీరయ్య, నాతరి రమేశ్, నాయకులు, యువకులు, తదితరులున్నారు.
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 6 : దంతన్పెల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. శ్యాంపూర్, సాలేవాడ, నర్సాపూర్(బీ), ఉమ్రి, ఏందా గ్రామాల్లో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహిం చారు. బీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు మునీ ర్, గ్రామాధ్యక్షుడు సులేమన్ యాఫై, దాసరి సత్యం, డొల్కల యేసు, వహీద్, నరటి రవి, జిల్లపెల్లి సురేశ్, సాదుల్ల, అర్షద్, మోతీలాల్, కుర్షిద్, ఎల్లయ్య, షంషు, రోహిత్, సుమన్, అనిల్, శ్రీనివాస్ యాదవ్, రజాక్, కరీం గ్రామ స్తులు, తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, డిసెంబర్ 6 : మండల కేంద్రం తోపాటు సట్వాజిగూడ, శంకర్గూడ, బుర్సన్ పటార్, మర్కాగూడ గ్రామాల్లో దళితుల ఆధ్వ ర్యంలో అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. మండల కేంద్రంలో నాయకులు, అధికారులు, దళితులు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి ఫూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భం గా అంబేద్కర్ మెమోరియల్ అసోసియేషన్ మండల కమిటీ అధ్యక్షుడు సోన్కాంబ్లే మనోహర్ మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ సాధనకు కోసం కృషి చేయాలన్నారు. వాగ్మారే కామ్రాజ్, రాజ్వర్ధన్, శివాజీ, దిలీప్మోరే, లహుదాస్, ఉత్తం కాంబ్లే, భావ్రావ్, సత్యానంద్, శుధోధన్, దత్తా, సునీల్, చిత్తు, ఉత్తముకాడే, కిషన్, నాగోరావ్, దళితానంద్ పాల్గొన్నారు.
ఖానాపూర్, డిసెంబర్ 6 : అంబేద్కర్ వర్ధంతి వేడుకలను ఖానాపూర్లో బుధవారం ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు, అధి కారులు, ప్రజాప్రతినిధులు అంబేద్కర్ విగ్ర హాని కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సతీశ్, సంతోష్, శంకర్, రాజేశ్వర్, రాజగంగన్న, నాయ కులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కడెం, డిసెంబర్ 6 : మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంపీడీవో కార్యాలయం లో ఎంపీపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. పలు గ్రామాల్లో దళిత, అంబేద్కర్ సంఘాల నాయ కులు వర్ధంతిని నిర్వహించారు. ఎంపీడీవో వెంక టేశ్వర్లు, ఎంపీటీసీ నర్సింగ్ రమేశ్, నాయకులు జడ ఇందూర్నేత, నాయకులు పాల్గొన్నారు.
దస్తురాబాద్, డిసెంబర్ 6 : మండల కేంద్రం తోపాటు మున్యాల, రేవోజిపేట, గొడిసెర్యాలతో పాటు పలు గ్రామాలోల అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధి కారులు, సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అంబేద్కర్ చిత్రపటం, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయక్, సర్పంచ్ దుర్గం శంకర్, ఏఈవో తిరుపతి, ఏపీఎం గంగాధర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు మునేసుల శైలేం దర్, గ్రామ అధ్యక్షుడు చెవుల మద్ది నర్సయ్య, వెంక్రటాజం, రాధిక, శ్రీదేవి, సత్యం,వరుణ్య, సుద్దాల రాజన్న, నాయకులు పాల్గొన్నారు.
నర్సాపూర్(జీ), డిసెంబర్ 6 : మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. జడ్పీటీసీ చిన్నరామయ్య, సర్పంచ్ రాంరెడ్డి, ఎంపీటీసీ మల్లేశ్, కొండ్ర రమేశ్, గోపిడి గంగారెడ్డి, కార్య దర్శి వీణారెడ్డి, సాయేందర్, ఫసి, సాగర్, బర్కుం ట నరేందర్, గడ్డం శ్రీధర్, బర్కుంట లక్ష్మణ్, బర్కుంట ప్రకాశ్, బర్కుంట గంగారాం, బర్కుం ట రాము, మాడెగాం గంగారాం, ప్రకాశ్, రాజన్న, అర్ల అశోక్, గడ్డం అశోశ్, శశికాంత్, తదితరులు పాల్గొన్నారు.
బాసర, డిసెంబర్ 6 : బాసర ఆర్జీయూకేటీలో బుధవారం అంబేద్కర్ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ వెంకటరమణ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. అడ్మినిస్ట్రేటివ్ కోఆర్డినేటర్ దావులు, అసోసియేట్ డీన్స్ డా. నాగసాయి, డా. దత్తు, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్ కో కన్వీనర్ డా. విఠల్, వసంత్బాబు, పీఆర్వో డా. విజయ్కుమార్, శాంబాబు, తదితరులున్నారు.