‘పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు కేసీఆర్ గ్రాఫ్ పెరుగుతోంది. పెద్దపల్లి అభ్యర్థిగా నన్ను చూసినప్పుడు నేను సింగరేణి కార్మికుడిని, ఉద్యమ కారుడిని, ఒక సామాన్య మనిషిని.. ఒక్కసారి అవకాశం ఇస్తే అద్భుతంగా చేసి చూపిస్తా. ఏ రకమైన అవినీతి ఆరోపణలు లేవు. 30 ఏండ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని మనిషిని. అవతలి వైపు చూస్తే కాంగ్రెస్ అభ్యర్థి వంశీ ఓ కార్పొరేట్ వ్యవస్థ నుంచి వచ్చినోడు. అతడికి ఆకలి విలువ తెలుసా? ప్రజల కష్టం తెలుసా? ఎండ తెలుసా? వ్యవసాయం తెలుసా? వడ్లు ఎట్ల పుడుతయే తెలుసా? వాళ్ల కోసం, వాళ్ల ఆస్తుల రక్షణ కోసం పదవులు తప్ప.. ప్రజల కోసం కాదనేది ప్రజలకు అర్థమైంది. అందుకే ఈ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అలాగే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను తెలంగాణ ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. మీ హక్కుల కోసం, మీ ఆత్మగౌరవం కోసం పోరాడే మీ ఇంటి పార్టీ బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’ అని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఈయన ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ : బీఆర్ఎస్కు ఉద్యమ పార్టీగా గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ ప్రాంతం కరవు కాటకాలతో అల్లాడేది. నీళ్లు లేక, కరెంట్ రాక, వ్యవసాయం సాగక రైతుల వలసలు వెళ్లేవారు. ఒకవైపు రైతుల ఆత్మహత్యలు, మరోవైపు చేనేత కార్మికుల ఆత్మహత్యలతో తల్లడిల్లింది. కేసీఆర్ తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చూసి సహించలేక 2001లో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టారు. 14 ఏండ్ల ఉద్యమంలో అనేక ఘట్టాలు, ఎన్నో అవమానాలు.. ఇవన్నీ తట్టుకుని తెలంగాణ రాష్ర్టాన్ని సాకారం చేశారు. సాధించుకున్న తెలంగాణను గాలికి వదిలిపెట్టలేదు. పదేళ్లలో దేశంలో ఎక్కడా జరగనటువంటి అభివృద్ధిని తెలంగాణలో చేశారు. ఉదాహరణకు.. ఒక ఇరిగేషన్ రంగం చూసుకుంటే గత పాలకులు 60 ఏండ్లు చేతులు ఎత్తేశారు. తెలంగాణకు నీళ్లు ఎక్కడివి అయ్యా.. మీకు బోర్లు, బావులే దిక్కు అన్నరు. మరి కరెంట్ అన్న ఇయ్యండి అంటే కరెంట్ కూడా ఇవ్వని దుస్థితి. కానీ.. ఈ రోజు అటు గోదావరి, ఇటు కృష్ణ నదుల్లో ఉన్న నీటిని ఒడిసిపట్టి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుతోపాటు 23 భారీ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేశారు. ఒకనాడు 42 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తే.. నేడు 1.20 కోట్ల ఎకరాల్లో పంటలు పండించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, ఆసుపత్రుల ఏర్పాటు, జిల్లాకో మెడికల్ కాలేజీ, పీహెచ్సీల అభివృద్ధి, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి.. ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్తో చేసినయ్. ఈ విషయాలన్నీ ప్రజల మనసుల్లో ఉన్నయ్. అందుకే బీఆర్ఎస్కు ఓటేయాలే.
ఈశ్వర్ : కాంగ్రెస్కు ఓటేస్తే ఏం జరిగిందనేది ఈ నాలుగు నెలల పరిపా లనలో మనం చూసినం. అన్నీ అబద్ధాల వాగ్ధానాలు చేశారు. చేసిన హామీలపై చిత్తశుద్ధి లేదు. ఆరు గ్యారెంటీల్లో ఒక్క గ్యారెంటీ నెరవేర్చలే దు. మొన్నటి దాకా గొప్పగా ఉన్న వ్యవసాయ రంగం కుప్పకూలింది. 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నరు. 50 లక్షల మంది ఆటో కార్మికులు అథోగతి పాలయ్యారు. నిధులు లేవు. పింఛన్లు రావ డం లేదు. రైతుబంధు వస్తలేదు. కల్యాణలక్ష్మీ తులం బంగారం దిక్కులేదు. నాలుగు నెలల్లోనే ఈ ప్రభుత్వ విధానం తెలిసింది. అందుకే ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఓటేసేందుకు ప్రజలు ముందుకు రారు. ఉద్యోగులకు ఫస్ట్ తారీఖున జీతం ఇస్తా అన్నారు కానీ ఇవ్వడం లేదు. ప్రగతి భవన్ బద్దలు కొట్టినం. ప్రజాపాలన పెడతాం అన్నారు. కానీ.. ప్రజాపాలనలో ఏ ఒక్క సమస్య పరిష్కారమైంది లేదు. ఈ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణవాది కాదు, తెలంగాణ రావా లని కోరుకున్నోడు కాదు. ఉద్యమకారుడు కాదు. తెలంగాణ ద్రోహి. ఉద్యమ కారులపై తుపాకీ పెట్టినోడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినోడు. సమాఖ్య ఆంధ్రప్రదేశ్ను కోరిన చంద్రబాబుకు సన్నిహితుడు, శిష్యుడు ఇవన్నీ జనాలకు తెలుసు. వీళ్లు ఏదో ఘనకార్యం చేశారని అధికారంలోకి రాలేదు. ప్రజలు మార్పు కోరుకున్నరు అంతే.. దాన్ని మరిచిపోయి ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రి మాట్లాడుతున్న అహంకారపు మాటలు చూసి ప్రజలే అసహించుకుంటున్నరు.
ఈశ్వర్ : కాంగ్రెస్ పార్టీలో నిజంగా రిజర్వేషన్ అనేది ఉంటే ఆ కుటుం బంలో ఒక్కరికే టికెట్ రావాలే. అందులో వివేక్ కుటుంబం అనేది దేశం లోనే 9వ స్థానంలో ఉన్న అత్యంత ఆస్తిపరులు, కుబేరులు. వాళ్లకు నిజంగా ఈ రిజర్వేషన్ అనుభవించే హక్కు కూడా లేదు. కానీ.. ఈ రిజ ర్వేషన్ పేరు చెప్పుకొనే కుటుంబం మొత్తం 76 సంవత్సరాలుగా జనా ల్ని పట్టి పీడిస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉంటే రెండు స్థానాల్లో వాళ్లే ఉన్నరు. పార్లమెంట్ కూడా వాళ్లే తీసుకో వడం ఎంత వరకు న్యాయం. మాదిగ, మాల సామాజిక వర్గాల్లో ఎంతో మంది చదుకున్నోళ్లు, యోగ్యులు ఉన్నారు. వాళ్లకు అవకాశం ఇస్తే నా యకులుగా ఎదిగే ఆస్కారం ఉంది. కానీ.. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. అస లు ఎందుకు వివేక్ కుటుంబం ఇక్కడికి రావాలి. కార్పొరేట్ రాజకీయం ప్రజల మీద రుద్ది, అవసరం ఉన్నప్పుడు డబ్బులు తీసుకువచ్చి, ఎన్నిక ల్లో గెలిచి ఏమైనా చేస్తారా అంటే ఏం లేదు. మీ తాత, మీ పెద్దనాయన, మీ నాన్న మరి ఇక్కడ ఏం చేశారు. మీకు వందల పరిశ్రమలు ఉంటే ఇ క్కడ ఒక పరిశ్రమ ఎందుకు పెట్టలేదు. ఉద్యోగాలు ఎందుకు ఇయ్యలే. క ష్టం వస్తే రారు. మీరు వీకెండ్ లీడర్స్. మీరు వస్తే మీకు హాలిడే కావాలి. కార్పొరేట్ ఆఫీస్ కావాలే. పొద్దున లేస్తే మీరు కార్పొరేట్ ఆఫీస్కు పో త రు. హైదరాబాద్కు పోయినా దొరకరు. ఎందుకోసం మీకు ఓటేయాలి.
ఈశ్వర్ : గడ్డం వంశీకి పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాదిగ, మాల, నేతకాని సామాజిక వర్గాలకు తీవ్రమైన అన్యాయం చేసింది. మాల సామాజిక వర్గానికి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పోనీ మిగిలిన రెండు చోట్ల మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వాలి కదా.. కానీ.. ఎందుకు ఇవ్వలేదు. సంఖ్యాపరంగా కూడా మాదిగ సామాజిక వర్గం ఎక్కువ ఉన్నది కదా.. ఇదేనా సామాజిక న్యాయం అని నేను ప్రశ్నిస్తున్నా. వీళ్లు తప్ప ఎవ్వరు లేరా.. మొన్నటి దాకా కుటుంబ పాలన అని కేసీఆర్ను అన్నరు కదా. దీన్ని ఏమంటరు మరీ. చెప్పడానికే నీతులా.. పాటించడానికి కాదా.. ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ వరంగల్, నాగర్కర్నూల్లో రెండు టికెట్లు ఇచ్చింది. ఇదే సామాజిక న్యాయం మీ పార్టీలో ఎందుకు లేదు. పైసలుంటే సామాజిక న్యాయం అయిపోతదా.. అక్కడ ఏఐసీసీని కొన్నరు. ఇక్కడున్న ఏడుగురు ఎమ్మెల్యేల్లో మీ ఇద్దరుపోతే ఐదుగురు ఎమ్మెల్యేలను కొన్నరు. పైసలు ముట్టినంకనే వాళ్లు ఒకే అని తల ఊపారు. రేపు మళ్లీ పదవిని కూడా కొంటరు. అందుకే మేం అంటున్నాం.. ఆగర్భ శ్రీమంతుడికి, భూగర్భ కార్మికుడిగా ఉన్న కొప్పుల ఈశ్వర్కు మధ్యే పోటీ.
ఈశ్వర్ : బీజేపీ తెలంగాణకు ద్రోహం చేసింది. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక అనేక సందర్భా ల్లో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మాట్లాడారు. తెలంగాణ రావడమే ఆయనకు ఇష్టం లేదు. కొత్త రాష్ట్రం గొప్పగా ఎదగాలని ముఖ్యమంత్రిగా కేసీఆర్ వారు తీసుకున్న ఎన్నో నిర్ణయాలను సమర్థి స్తూ, స్నేహ సంబంధాలు కొనసాగించినప్పటికీ మమ్ములను తొక్కేయాలని, నిధులు ఇవ్వకుండా, వేధిం పులకు గురి చేశారు. ఈ రోజుకు కూడా ఈడీ కేసులు బనాయించుకుంటా ఇబ్బందులు పెడుతున్నారు. అది పక్కన పెడితే ఈ రాష్ర్టానికి ఏమన్నా చేశారా అంటే అదీ లేదు. నిజాయితీగా రావాల్సిన నవోదయ పాఠశాల ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఐటీఐఆర్ బెంగళూర్కు తరలించారు. మాకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేశారు. బీఆర్ఎస్ పార్టీని, నాయకత్వాన్ని మింగేయాలని.. ఇంత గొప్పగా ప్రజలకు సేవలు అందించినా కూడా మా మీద అధికార బలాన్ని చూపిస్తున్నరు. తెలంగాణకు బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చేసింది ఏం లేదు. ఎన్నడూ కూడా తెలంగాణపై వారికి ప్రేమ లేదు. అలాంటప్పుడు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎందుకు ఓటేయాలి. జనమే ఇది ఆలోచించాలి.
ఈశ్వర్ : మోదీ ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేసేందుకు చేసిన కుట్రలను అడ్డుకున్న బీఆర్ఎస్ పార్టీ.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఓటు వేస్తే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి గట్టిగా పోరాడుతాం. ఐటీ సమస్యను తప్పకుండా పరిష్కరించొచ్చు. కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాల్సిన అవసరం లేదు. సింగరేణి సంస్థనే దాన్ని సర్దుబాటు చేయొచ్చు. సింగరేణి కార్మికుల ఉద్యోగ భద్రత కోసం, పొల్యూషన్ కంట్రోల్ కోసం కచ్చితమైన చర్యలు తీసుకునేలా పోరాటాలు చేస్తాం. కార్మికులుగా రిటైరయ్యాక కూడా అక్కడే ఉంటున్నవాళ్లు, కనీసం ఇల్లు కూడా లేని వాళ్లకి ప్రస్తుతం వాళ్లు ఉంటున్న స్థలాలను, క్వార్టర్లను వారికే ఇవ్వాలనే విషయంలోనూ కార్మికుల పక్షాన నిలబడతాం. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం అనేక కార్యక్రమాలు చేశాం. 15 వేల కటుంబాలకు కారుణ్య నియామకాలు ఇచ్చాం. వేల మందికి పట్టాలు ఇచ్చాం. లాభాల్లో వాటా పంపిణీ చేసినం. ఇవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగాయి. కార్మికులకు ఒకటే చెప్తున్నా.. మీ పక్షాన నిలబడుతాం. మన కోసం ఆలోచించే పార్టీని, నాయకులను కాపాడుకోవాలని పిలుపునిస్తున్నా. సింగరేణి కార్మికుల సమస్యలపై త్వరలోనే ఓ నిరసన దీక్ష నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాం. అన్ని వర్గాలకు కలుపుకుని ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి చూపిస్తాం.