కెరమెరి, జనవరి 13 : యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆసిఫాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. శనివారం చిన్న సాకడ(శ్యాంరావుగూడ) గ్రామంలో నిర్వహించిన స్వర్గీయ పెందోర్ జంగు పటేల్ స్మారక కబడ్డీ 24వ క్రీడోత్సవాల్లో పాల్గొని పోటీలు ప్రారంభించారు. అంతకుముందు జంగు పటేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెందోర్ మోతిరాం, వైస్ ఎంపీపీ అబుల్ కలాం, సర్పంచులు సుమిత్రాబాయి, కుమ్రం నాణేశ్వర్, నాయకులు కుమ్రం భీంరావ్, రాము నిర్వాహకులు పెందోర్ ఆనంద్రావు, పెందోర్ దంబీరావు, పెందోర్ శ్రీనివాస్, సెడ్మాకి తుకారాం, సోము, వినేష్, భరత్, ఆదివాసీ సంఘాల నాయకులు, రాయ్ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు.