తానూర్, నవంబర్ 22 : ముథోల్ నియోజక వర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొ న్నారు. బుధవారం ఉమ్రి (కే) బోరి గాం, బెంబర్, బోల్సా, వడ్ఝరి, ఝరి(బీ), ఝరితండా, బొంద్రట్, భోసి, మహాలింగి, బామ్ని, బామ్నితండ గ్రామాల్లో మాజీ ఎమ్మెల్సీ, పురాణం సతీశ్కుమార్, బీఆర్ఎస్ నాయకు రాలు పడకంటి రమాదేవితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిం చారు. బోరిగాం, బెంబర్ గ్రామాల్లో రైతులు ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు.
నాయ కులకు స్వాగతం పలికారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే విఠల్రెడ్డి మాట్లాడుతూ మరో సారి తనను ఆశీర్వదిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని హామీ నిచ్చారు. హంగిర్గా సొసైటీ చైర్మన్ నారాయణ్రావు పటేల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోతారెడ్డి, మాజీ జట్పీటీసీ ఉత్తం బాలేరావు, మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, కోఆప్షన్ సభ్యుడు గోవింద్పటేల్, బీఆర్ఎస్ చంద్రకాంత్యాదవ్ పాల్గొన్నారు.
భైంసా, నవంబర్ 22 : తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభు త్వమే ఏర్పాటవుతుందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. మంగళవారం రాత్రి లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామం నుంచి 50 మంది మహిళలు, కుంటాల మండలం అందకూర్ గ్రామం నుంచి 50 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా భైంసాలో పలు వార్డులలో బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణ, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోట రాము, యశ్వంత్ బన్సోడే, శీను, భోజారాం ఉన్నారు.
కుంటాల, నవంబర్ 22 : పదేళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తనకు బీజేపీ టికెట్ నిరాకరించి నమ్మక ద్రోహం చేసిందని బీఆర్ఎస్ నాయకురాలు పడ కంటి రమాదేవి పేర్కొన్నారు. కుంటాల మండ లం అందకూర్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పలు వీధుల్లో రోడ్ షో నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీ అభ్య ర్థిని ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. మరోసారి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరా రు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ పడకంటి దత్తు, జడ్పీటీసీ కొత్తపల్లి గంగామణి బుచ్చన్న, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ప్రవీణ్, సర్పంచ్ దాసరి కిషన్, ఎంపీటీసీ మధు, పార్టీ గ్రామ అధ్యక్షుడు రవి, ఆత్మ మాజీ చైర్మన్ అశోక్రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ పెంటవార్ దశరథ్, శ్రీనివాస్, దత్తు, నాయకులు సాగర్ రావు, నర్సింగ్ రావు, జుట్టు మహేందర్, గిరీశ్, రమణా గౌడ్, హైమద్ పాషా, వెంకటేశ్, పురుషోత్తం, అహ్మద్, రజనీ కాంత్, తాటి మహేశ్, సబ్బిడి రాకేష్, గజేందర్, తదితరులు పాల్గొన్నారు.
కుభీర్, నవంబర్ 22 : పార్డి (బీ), నిగ్వ, మాలేగావ్, పల్సి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ముమ్మరంగా ప్రచారం చేశారు. కుభీర్లో స్థానిక సర్పంచ్ పానాజీ మీరా విజయ్కుమార్, పార్డి(బీ)లో బీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి తూం రాజేశ్వర్ స్థానిక నాయకులతో కలిసి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి విఠల్రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టౌన్ అధ్యక్షుడు బొప్ప నాగలింగం, నాయకులు సూది రాజన్న, ఉప సర్పంచ్ తుకారాం, లక్ష్మణ్, బాబు, బెల్లాల గంగయ్య, గంధం పోశెట్టి, పోగుల లింగన్న, కే లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.
లోకేశ్వరం, నవంబర్ 22 : బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు నచ్చి బీజేపీ నుంచి ధర్మోరా గ్రామానికి చెందిన దాదాపు 80 మంది యువకులు వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. యువకులకు జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. వైస్ ఎంపీపీ నారాయణ రెడ్డి, మండల కన్వీనర్ కరిపె శ్యాం సుం దర్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు భుజంగ్ రావు, గడ్ చాంద సర్పంచ్ వెంకట్ రావు, కపిల్, సుదర్శన్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగన్న, బండి ప్రశాంత్, మగ్గిడి భోజా రెడ్డి పాల్గొన్నారు.
బాసర, నవంబర్ 22 : మండల కేంద్రంలోని ఉప్పుకుంట కాలని, దోభీగల్లీ, బొర్రగణేశ్ కాలనీలో సర్పంచ్ డీ లక్ష్మణ్రావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కొర్వ శ్యాం ప్రచారం నిర్వహిం చారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 30వ తేదిన జరుగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి విఠల్రెడ్డిని మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైస్ ఎంపీ పీ ఓని నర్సింగ్రావు, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గౌడ్, నాయ కులు నుకం రామరావు, తదితరులున్నారు.
భైంసాటౌన్, నవంబర్ 22 : మండలంలోని దేగాం గ్రామా నికి చెందిన 30 మంది యువకులు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారిని గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.