ఖానాపూర్, జూన్ 5: రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఖానాపూర్ పీఏసీస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్రెడ్డి, వైస్ చైర్మన్ కరిపే శ్రీనివాస్, సీఈవో ఆశన్న, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, ఏఈవో మనీషా, నాయకులు గజేందర్, ప్రదీప్, చంద్రహస్, గోపాల్, డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
ఖానాపూర్ రూరల్, జూన్ 5: మండలంలోని సత్తనపల్లి రైతు వేదికలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జీలుగు విత్తనాలను ఎమ్మెల్యే రేఖానాయక్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మోహిద్, ఎఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, పీఏసీఎస్ చైర్మన్ అమంద శ్రీనివాస్, సీఈవో తుప్రాన్ శ్రీనివాస్, కరిపె శ్రీనివాస్, చింతల దాసు గౌడ్, ఏఈవో రాకేశ్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఉట్నూర్ రూరల్, జూన్ 5: మండలంలోని హస్నాపూర్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేంద్రాన్ని వినియోగించు కోవాలని కోరారు. పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు అజీమొద్దీ న్, పీఏసీఎస్ సీఈవో అశోక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేష్, కార్యదర్శి మల్లయ్య, నాయకులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.