ఇంద్రవెల్లి, జూలై 26: రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నదని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండలంలోని అంజీ రైతు వేదికలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బుధవారం రైతు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ కావా లో, మూడు పంటలు కావాలో రైతులే తేల్చుకోవాని సూచించారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రైతులకు ఒరిగిందేమి లేదని స్పష్టం చేశారు. కరం ట్ ఎప్పుడస్తుందో.. ఎప్పుడు పోతుందో కూడా తెలిసేది కాదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనడం సిగ్గుచేటన్నారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తున్నాని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పార్టీ శ్రేణులు ప్రజలకు అవగహన కల్పించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతీ పటేల్డోంగ్రే, ఏఎంసీ మాజీ చైర్మ న్ జాదవ్ శ్రీరాంనాయక్, సర్పంచ్లు కోరెంగా గాంధారి, రాథోడ్ శారద, ఆడే విజయ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్, జాదవ్ స్వర్ణలత, గీత్తే ఆశాబాయి, మాజీ ఎంపీటీసీ కనక హనుమంత్రావ్, మాజీ ఏఎంసీ చైర్మన్ రాథోడ్ వసంత్రావ్, నాగో బా ఆలయ కమిటీ చైర్మన్ మెస్రం తుకారాం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవ్పూజె మారుతి, పోటే సాయినాథ్, రాంనివాస్, నవాబ్బేగ్, ధర్ము, రాంషావ్, కోరెంగా సుంగుపటేల్, కోరెంగా సుంకట్రావ్, శివాజీ, తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
మండలంలో 17మంది లబ్దిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్మే రేఖానాయక్ అన్నారు. మండలకేంద్రంలోని మిలింద్నగర్లోని బుద్ధవిహర్లో బుధవారం బుద్ధుడికి పూజలు చేశారు. అనంతరం బుద్ధవిహర్లో దళితులతోపాటు మ హిళలతో కలిసి వివిధ సమస్యలపై చర్చించారు. దళితబంధు పథకం ఎంపిక విధానంపై అవగహ న కల్పించారు. దళిత సంఘాల నాయకులు సోన్కాంబ్లే మనోహర్, వాగ్మారే కామ్రాజ్, సునీల్, శివాజీ, గౌత్తం, కచ్రుబా, వాగ్మారే బాబు, తదితరులు పాల్గొన్నారు.
బెల్ట్ షాపులు తొలగించాలి
అక్రమ బెల్ట్ షాపులు తొలగించాలని కోరుతూ తుడుందెబ్బ, దళిత సంఘాలు, మానవ హక్కుల వేదిక నాయకులు బుధవారం ఎమ్మెల్యే రేఖానాయక్ను కలిసి విన్నవించారు. బెల్ట్ షాపుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సీసాలు ఎమ్మెల్యే రే ఖానాయక్కు చూపించారు. ఎమ్మెల్యే రేఖానాయ క్ మాట్లాడుతూ. బెల్ట్ షాపులను తొలగించి, కే సులు నమోదు చేయాలని ఎస్ఐ డీ సునిల్కు సూ చించారు. నాయకులు జుగ్నాక్ భరత్, జాలిషావ్, గేడాం భారత్, పుర్క చిత్రు, కాంబ్లే అతీశ్ కుమా ర్, మురారి, భీంరావ్, తదితరులు పాల్గొన్నారు.