తలమడుగు, మార్చి 26 : బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని సుంకిడి లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామస్తులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడా రు. దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. ప్రభు త్వం ప్రవేశపెడుతున్న పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మేస్థితిలో లేరన్నారు. ప్రతి గ్రామం, కాలనీలో సీసీ రోడ్లు వేస్తున్నామన్నారు. అందరి సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలకు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేకు పూలమాల, శాలువాతో సత్కరించారు. సుంకిడిలో పండుగ వాతావరణం నెలకొం ది. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు తోట వెంకటేశ్, పార్టీ అధికార ప్రతినిధి మొ ట్టే కిరణ్కుమార్, ఝరి పీఏసీఎస్ చైర్మన్ వెల్మ శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్లు ఆనంద్, నరసింహు లు, పోతారెడ్డి, రాంబాయి, కిష్టన్న, పార్టీ నాయకులు ఆశన్న యాదవ్, మగ్గిడి ప్రకాశ్, మేకల వెంకన్న, తోట ప్రమోద్, ప్రసూన్ పాల్గొన్నారు.