ఎదులాపురం, జనవరి 25 : రిమ్స్ దవాఖానలో కేంద్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎం పథకం కింద మంజూరు చేసిన క్రిటికల్ కేర్ భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం జిల్లాలో ఆరోగ్య సేవలను విస్తృత పరచడానికి భవనాలను నిర్మిస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, సూపరింటెండెంట్ అశోక్, సీనియర్ వైద్యులు తిప్పస్వామి, ఈఈ నరసింహారావు, బీజేపీ నాయకులు, వార్డు కౌన్సిలర్లు ఉన్నారు.