సిర్పూర్(టీ), ఫిబ్రవరి 11 : ప్రతి ఒక్కరూ చత్రపతి శివాజీ స్ఫూర్తితో ముందుకెళ్లాలని సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని నవేగాం గ్రామంలో ఆరె కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు సేవ చేసిన గొప్ప వ్యక్తి శివాజీ మహరాజ్ అని కొనియాడారు. ప్రజలంతా చైతన్యవంతులై గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులకు సిర్పూర్(టీ) శివాజీ మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.
పట్టణంలో భారీ ర్యాలీ…
విగ్రహావిష్కరణ సందర్భంగా మండల కేం ద్రంలోని శివాజీ విగ్రహం నుంచి నవేగాం వ రకు ఆరెకుల సంఘం నాయకుల ఆధ్వర్యం లో భారీ ర్యాలీ తీశారు. జై శివాజీ, జై భవానీ, హర హర మహదేవ్ నినాదాలతో యువకులు హోరెత్తించారు. జిల్లా ఆరె కుల సంఘం అధ్యక్షుడు బోట్టుపల్లి జైరాం, మండలాధ్యక్షుడు చన్కపురే శంకర్, ఎంపీటీసీలు సుహేల్ అహ్మద్, నవేగాం మాజీ సర్పంచ్ చిన్నుబాయి, నాయకులు నీరటి సత్యనారయణ, ఎల్ములే కిషోర్, నాయకులు పాల్గొన్నారు.