రెబ్బెన, ఏప్రిల్ 14 : ఇందిరానగర్ గ్రామానికి చెందిన వడ్లూరి గణపతి, దుర్గం చిన్నయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బాధిత కుటుంబ సభ్యులను ఆదివారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పరామర్శించారు. అధైర్యపడవద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం ప్రమాదాలు జరుగుతున్న రోడ్డును పరిశీలించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆమె వెంట ఎంపీపీ జుమ్మిడి సౌందర్య, వైస్ ఎంపీపీ గజ్జల సత్యనారాయణ, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ శంకరమ్మ, నాయకులు పల్లె రాజేశ్వర్రావు, జుమ్మిడి ఆనందరావు, తిరుపతిగౌడ్, దుర్గం తిరుపతి, పద్మ ఉన్నారు.